Asaduddin Owaisi: ముస్లింలను అంతం చేయడమే వక్ఫ్ బిల్లు లక్ష్యం..
- ముస్లింలను అంతం చేయడానికే వక్ఫ్ బిల్లు..
- రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని దెబ్బతీస్తోంది..
- వక్ఫ్ బిల్లుపై అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: వక్ఫ్ బిల్లుపై అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులో చాలా ప్రమాదకరమైన సెక్షన్లు ఉన్నాయని గురువారం విరుచుకుపడ్డారు. ఇది చట్టం కాదని, వక్ఫ్ని నేలమట్టం చేసి, ముస్లింలను అంతం చేయడమే లక్ష్యమని ఆరోపించారు. బిల్లును ప్రవేశపెట్టడానికి ముందు రూల్ 72 ప్రకారం స్పీకర్కి నోటీసులు ఇచ్చానని, బిల్లుకు తాము వ్యతిరేకమని చెప్పారు. ఈ బిల్లు ఆర్టికల్ 14,15, 25 సూత్రాలను ఉల్లంఘిస్తోందని చెప్పారు. రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని కూడా దెబ్బతీస్తుందని అన్నారు.
Read Also: Pawan Kalyan: సినీ హీరోలపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి నాదెండ్ల
Also Read
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ చెబుతున్న మసీదులను లాక్కోవడానికి, రైట్ వింగ్ హిందుత్వ సంస్థలు ఆరోపిస్తున్న దర్గాలను లాక్కోవాలని భావిస్తున్నట్లు ఓవైసీ ఆరోపించారు. వక్ఫ్ని తీసేసి 400 ఏళ్ల నాటి పురాతన పత్రాలను తీసుకురావాలని చెబితే ఎలా.? అని ప్రశ్నించారు. ఇందులో చాలా ప్రమాదకరమైన సెక్షన్లు ఉన్నాయని, వక్ఫ్ బోర్డు మంచికి బదులు దానిని అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మత స్వేచ్ఛకు తీవ్ర విఘాతమని, ఎవరైనా ముస్లిం కాదా అని నిర్ణయించడానికి మీరు ఎవరు..? అని ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే ప్రతిపక్షాల విమర్శలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు. వక్ఫ్ బోర్డుల్లోకి మాఫియా చొరబడిందని అన్నారు. కాంగ్రెస్ హయాంలోని సచార్ కమిటీ సిఫారసులతోనే బిల్లును రూపొందించినట్లు పేర్కొన్నారు. బిల్లు రూపొందించే ముందు అనేక మంది ముస్లిం పెద్దలతో మాట్లాడినట్లు చెప్పారు. వక్ఫ్ ఆక్రమణ, అక్రమాలపై తిరుచిరాపల్లి ఆలయం వివాదాన్ని, సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ వివాదాన్ని ప్రస్తావించారు. 1500 ఏళ్ల ఆలయం ఉన్న గ్రామం మొత్తం వక్ఫ్ ఆస్తి ఎలా అవుతుందని కేంద్రమంత్రి ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!