Bihar: బీహార్లో మావోల దుశ్చర్య..? రెండు జేసీబీలతో సహా 6 వాహనాలు దగ్ధం
- బీహార్లోని అర్వాల్లో ఓ నిర్మాణ సంస్థపై దాడి
- గురువారం అర్థరాత్రి మఖమిల్పూర్ గ్రామ సమీపంలోని పెట్రోల్ పంపు వద్ద
- పార్క్ చేసిన రోడ్డు నిర్మాణ సంస్థ వాహనాలకు గుర్తు తెలియని దుండగులు నిప్పు
- రెండు జేసీబీలతో సహా 6 వాహనాలు దగ్ధం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లోని అర్వాల్లో ఓ నిర్మాణ సంస్థపై దాడి జరిగింది. గురువారం అర్థరాత్రి మఖమిల్పూర్ గ్రామ సమీపంలోని పెట్రోల్ పంపు వద్ద పార్క్ చేసిన రోడ్డు నిర్మాణ సంస్థ వాహనాలకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. కొంతమంది పెట్రోల్ పంపు వద్దకు చేరుకుని రోడ్డు రోలర్, రెండు జేసీబీలు, రెండు హైవేలు, రెండు ట్రాక్టర్లతో కూడిన ట్యాంకర్లను తగులబెట్టారు. ఈ క్రమంలో.. రోడ్డు రోలర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. జేసీబీ కూడా చాలా దెబ్బతింది. హైవేపై ట్రాక్టర్ టైర్లను తగులబెట్టారు. ఇది నక్సలైట్ల పని అని జనాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. రెండ్రోజుల క్రితం లెవీ విధించాలని కోరుతూ రెడ్ కరపత్రం వేశారు.
Read Also: Fake Currency Gang: నకిలీ నోట్ల ముఠాను పట్టించిన ఏటీఎం..!
Also Read
- Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
- Parthiv Patel: హిట్మ్యాన్ను తక్కువ అంచనా వేయొద్దు'.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
- Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే కర్పి పోలీస్ స్టేషన్ ఇంచార్జి ఉమేష్ రామ్.. అర్ధరాత్రి పెట్రోల్ పంపు వద్దకు చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సబ్ డివిజనల్ పోలీసు అధికారి కృతిక్కమల్ కూడా రాత్రి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముసుగులు ధరించిన ముష్కరులు రాత్రి వచ్చి వాహనాలకు నిప్పుపెట్టి వెళ్లిపోయారని సిబ్బంది తెలిపారు. అయితే.. రెండ్రోజుల క్రితం ఎర్ర పెన్నుతో లెవీ వసూలు చేయాలని లేఖ రాశారు. నక్సలైట్లు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు.
Read Also: Champions Trophy: భారత్ ఆడే మ్యాచ్లన్నీ అక్కడే.. నేడే షెడ్యూల్ విడుదల!
అయితే ఇది నక్సలైట్లు చేసింది కాదని పోలీసులు కొట్టిపారేశారు. శుక్రవారం ఎస్పీ రాజేంద్ర కుమార్ భిల్ పెట్రోల్ పంపు వద్దకు చేరుకుని పరిశీలించారు. ఈ కేసులో కొందరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన కొందరిని ఎస్పీ విచారించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. దీనిపై ఇప్పటి వరకు నిర్మాణ సంస్థ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.
తాజావార్తలు
-
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
-
Parthiv Patel: హిట్మ్యాన్ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
-
Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
-
Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
-
Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?