CM Chandrababu: ఇసుక, లిక్కర్ పాలసీపై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు..
- ఇసుక.. లిక్కర్ పాలసీపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
- రాష్ట్రంలో చెత్త పన్ను విధించి రాష్ట్రాన్ని చెత్త రాష్ట్రంగా మార్చారు
- చెత్త పన్ను రాష్ట్రంలో తీసి వేసాం- సీఎం
- రూ. 600 కోట్లతో గుంతలు పూడుస్తున్నాం- చంద్రబాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇసుక, లిక్కర్ పాలసీపై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఇసుక, లిక్కర్ పాలసీల్లో ఎవరు వేలు పెట్టడానికి లేదు.. ఉచిత ఇసుక ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందేనని అన్నారు. ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లతో ఇసుక తీసుకెళ్లే వాళ్ళ మీద కేసులు పెట్టొద్దు.. ఎడ్లబండితో ఇసుక తీసుకువెళ్లే వారిపై గ్రామాల్లో రైతులు మీద పెత్తనం చేయొద్దని సీఎం సూచించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలకు పాల్పడుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రథాలు తగలబెట్టడం, ఆడవాళ్ళపై అఘాయిత్యానికి పాల్పడటం చేస్తున్నారు.. రాష్ట్రంలో ఉన్న 14 వేల సీసీ కెమెరాలు గత ప్రభుత్వం వాడలేదని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తిని కూడా వాడుకోలేని దుస్థితిలో ఉన్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వీధిలైట్లు అన్ని వెలగాలి.. అధికారులు కూడా అశ్రద్ధ వీడాలి.. గత ప్రభుత్వం చేసిన పాపాలు ప్రజలను వెంటాడుతున్నాయి.. తవ్విన కొద్దీ అవినీతి, అరాచకాలు బయటపడుతున్నాయన్నారు. అడవి పందులు, పంటను నాశనం చేసినట్లు, రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేశారని మండిపడ్డారు.
Russian-Ukraine War: ఉక్రెయిన్పై రష్యా భారీ దాడి.. 136 డ్రోన్లు ప్రయోగం
Also Read
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం, గంజాయి వాడకంతో.. తల్లికి, చెల్లికి, కూతురికి తేడా లేకుండా కొంతమంది దుర్మార్గులు ప్రవర్తిస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అలాంటివి ఇక మీదట జరగకూడదని హెచ్చరించారు. రాష్ట్రంలో చెత్త పన్ను విధించి రాష్ట్రాన్ని చెత్త రాష్ట్రంగా మార్చారు.. ఆ చెత్తలో వేసి వాళ్ళని కప్పి పెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త పన్ను రాష్ట్రంలో తీసేశాం.. రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలు పెట్టారు.. రూ. 600 కోట్లతో గుంతలు పూడుస్తున్నామని తెలిపారు. నవంబర్ 1 నుంచి రోడ్ల గుంతలు పూడుస్తాం.. నూతన సంవత్సరానికి రాష్ట్రంలో గుంతలు లేకుండా చేస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
RGV: గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ని ప్రశంసిస్తూ.. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ వైరల్
అమరావతి రాష్ట్రానికి ఏకైక రాజధాని.. విశాఖపట్నం మన ఆర్థిక రాజధాని అని సీఎం చంద్రబాబు అన్నారు. కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం.. ఇండస్ట్రియల్ హబ్గా అద్భుతమైన సిటీని నిర్మిస్తామన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం.. ఎన్డీఏ కూటమి పాలసీ అమరావతి ఏకైక రాజధాని అని చెప్పారు. మరోవైపు.. రాష్ట్రంలో స్వర్ణకారుల భవిష్యత్తు కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు ఇన్సెంటివ్ ఇస్తామన్నారు. బీసీలు, ఎస్సీలు, మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తాం.. పరిశ్రమల ఏర్పాటులో లోకల్, నాన్ లోకల్ అనే అంశాలు చూడకూడదని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మనవాళ్లు వెళ్లి అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారు.. అలాగే బయట వారు కూడా వచ్చి మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుకోవచ్చు, ఉపాధి పొందవచ్చని సీఎం పేర్కొన్నారు.
తాజావార్తలు
-
chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్పై మెగాస్టార్ రియాక్షన్ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
-
CM Revanth Reddy : మల్కాజ్గిరి నా రాజకీయ పునర్జన్మ..
-
Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
-
Varanasi: వారణాసి నుంచి మాంసం దుకాణాలు అవుట్..
-
Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!