CM Chandrababu: ఇసుక, లిక్కర్ పాలసీపై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు..
- ఇసుక.. లిక్కర్ పాలసీపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
- రాష్ట్రంలో చెత్త పన్ను విధించి రాష్ట్రాన్ని చెత్త రాష్ట్రంగా మార్చారు
- చెత్త పన్ను రాష్ట్రంలో తీసి వేసాం- సీఎం
- రూ. 600 కోట్లతో గుంతలు పూడుస్తున్నాం- చంద్రబాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇసుక, లిక్కర్ పాలసీపై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఇసుక, లిక్కర్ పాలసీల్లో ఎవరు వేలు పెట్టడానికి లేదు.. ఉచిత ఇసుక ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందేనని అన్నారు. ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లతో ఇసుక తీసుకెళ్లే వాళ్ళ మీద కేసులు పెట్టొద్దు.. ఎడ్లబండితో ఇసుక తీసుకువెళ్లే వారిపై గ్రామాల్లో రైతులు మీద పెత్తనం చేయొద్దని సీఎం సూచించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలకు పాల్పడుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రథాలు తగలబెట్టడం, ఆడవాళ్ళపై అఘాయిత్యానికి పాల్పడటం చేస్తున్నారు.. రాష్ట్రంలో ఉన్న 14 వేల సీసీ కెమెరాలు గత ప్రభుత్వం వాడలేదని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తిని కూడా వాడుకోలేని దుస్థితిలో ఉన్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వీధిలైట్లు అన్ని వెలగాలి.. అధికారులు కూడా అశ్రద్ధ వీడాలి.. గత ప్రభుత్వం చేసిన పాపాలు ప్రజలను వెంటాడుతున్నాయి.. తవ్విన కొద్దీ అవినీతి, అరాచకాలు బయటపడుతున్నాయన్నారు. అడవి పందులు, పంటను నాశనం చేసినట్లు, రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేశారని మండిపడ్డారు.
Russian-Ukraine War: ఉక్రెయిన్పై రష్యా భారీ దాడి.. 136 డ్రోన్లు ప్రయోగం
Also Read
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
- Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
- AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం, గంజాయి వాడకంతో.. తల్లికి, చెల్లికి, కూతురికి తేడా లేకుండా కొంతమంది దుర్మార్గులు ప్రవర్తిస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అలాంటివి ఇక మీదట జరగకూడదని హెచ్చరించారు. రాష్ట్రంలో చెత్త పన్ను విధించి రాష్ట్రాన్ని చెత్త రాష్ట్రంగా మార్చారు.. ఆ చెత్తలో వేసి వాళ్ళని కప్పి పెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త పన్ను రాష్ట్రంలో తీసేశాం.. రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలు పెట్టారు.. రూ. 600 కోట్లతో గుంతలు పూడుస్తున్నామని తెలిపారు. నవంబర్ 1 నుంచి రోడ్ల గుంతలు పూడుస్తాం.. నూతన సంవత్సరానికి రాష్ట్రంలో గుంతలు లేకుండా చేస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
RGV: గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ని ప్రశంసిస్తూ.. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ వైరల్
అమరావతి రాష్ట్రానికి ఏకైక రాజధాని.. విశాఖపట్నం మన ఆర్థిక రాజధాని అని సీఎం చంద్రబాబు అన్నారు. కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం.. ఇండస్ట్రియల్ హబ్గా అద్భుతమైన సిటీని నిర్మిస్తామన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం.. ఎన్డీఏ కూటమి పాలసీ అమరావతి ఏకైక రాజధాని అని చెప్పారు. మరోవైపు.. రాష్ట్రంలో స్వర్ణకారుల భవిష్యత్తు కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు ఇన్సెంటివ్ ఇస్తామన్నారు. బీసీలు, ఎస్సీలు, మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తాం.. పరిశ్రమల ఏర్పాటులో లోకల్, నాన్ లోకల్ అనే అంశాలు చూడకూడదని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మనవాళ్లు వెళ్లి అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారు.. అలాగే బయట వారు కూడా వచ్చి మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుకోవచ్చు, ఉపాధి పొందవచ్చని సీఎం పేర్కొన్నారు.
తాజావార్తలు
-
NTR Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డేకి ప్రశాంత్ నీల్ గిఫ్ట్ రెడీ.. ఇక రచ్చ రచ్చే!
-
West Bengal: కలకత్తా హైకోర్టులో మమతా బెనర్జీకి ఘోర అవమానం..
-
RCB: పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్నా.. ఆర్సీబీ కంటే ఆ జట్టుకే ప్లే ఆఫ్ అవకాశాలు..
-
White House: చైనాలో ట్రంప్ టూర్.. హార్ముజ్ జలసంధిపై వైట్హౌస్ కీలక ప్రకటన
-
Health Tips : పార్టీ చేసుకున్న మరుసటి రోజే జిమ్కు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త..!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?