AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP New Zonal System: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం అమలుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రపతి ఉత్తర్వులు–2025కు అనుగుణంగా స్థానిక (లోకల్) క్యాడర్ల ఏర్పాటు, ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను చేపడుతూ సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం మూడు అంచెల కమిటీలను ఏర్పాటు చేసింది.. జిల్లా, శాఖాధిపతి, సచివాలయ స్థాయిల్లో ప్రత్యేక కమిటీలు పనిచేయనున్నాయి. జిల్లా కమిటీకి పాత జిల్లా కలెక్టర్ చైర్మన్గా వ్యవహరించగా, కొత్త జిల్లాల కలెక్టర్లు కో-చైర్మన్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఉద్యోగుల సీనియారిటీ, వ్యక్తిగత ప్రాధాన్యతలు, ప్రభుత్వ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని క్యాడర్ల కేటాయింపులు చేపట్టనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ప్రత్యేక వర్గాల ఉద్యోగులకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించింది. 70 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న ఉద్యోగులు, వితంతువులు, అలాగే క్యాన్సర్, గుండె శస్త్రచికిత్స, కిడ్నీ లేదా లివర్ మార్పిడి చేయించుకున్న ఉద్యోగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనుంది. దీంతో ఆరోగ్య, సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మానవతా కోణంలో నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST)కు క్యాడర్లలో నిష్పత్తి ప్రకారం సమాన పంపిణీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. SC గ్రూప్-1కు 1 శాతం, గ్రూప్-2కు 6.5 శాతం, గ్రూప్-3కు 7.5 శాతం, STలకు 6 శాతం మేర కేటాయింపులు ఉండనున్నాయి.
Also Read
- Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
- COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు..
ఉద్యోగుల నుంచి తప్పుడు సమాచారం అందితే కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. అలాగే ఒకసారి ఉద్యోగి తన ఆప్షన్ నమోదు చేసిన తర్వాత దాన్ని మార్చుకునే అవకాశం ఉండదని స్పష్టం చేసింది. భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న స్పౌస్ కేసుల కోసం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగుల కేటాయింపులపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, కేటాయింపు ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి ఏడు రోజులలోపు సంబంధిత సచివాలయ కార్యదర్శికి అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించింది. కొత్త జోనల్ విధానం ద్వారా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ మరింత పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతుందని పేర్కొంది ఏపీ ప్రభుత్వం..
తాజావార్తలు
-
AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
-
LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
-
Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
-
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’కి ఏ సర్టిఫికేట్.. విడుదలకు ముందే పెరిగిన హైప్
-
Astrology: జూలై 18 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?