Minister Parthasarathy: జగన్పై మంత్రి పార్థసారథి ఫైర్.. విద్వేష రాజకీయాలతో అధికారంలోకి రావాలనుకుంటున్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Parthasarathy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ, విద్వేషాలను రెచ్చగొట్టి మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన రాజకీయాలే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కంటే తన రాజకీయ లక్ష్యాలనే ముఖ్యంగా భావిస్తున్నారని మంత్రి పార్థసారథి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించారని, అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు.
‘విద్వేషాలతో మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నం’
గతంలో బాబాయ్ హత్య, కోడికత్తి ఘటన, తుని రైలు దహనం వంటి సంఘటనల నేపథ్యంలో రాజకీయ లబ్ధి పొందారని, ఇప్పుడు కూడా అంతకంటే తీవ్రమైన విద్వేషాలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు పార్థసారథి.. ప్రజలను ఎప్పటికప్పుడు మోసం చేయాలని చూస్తే వారు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఇక, దళితుల పట్ల జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రజలు గుర్తు చేసుకోవాలని మంత్రి అన్నారు. అనంతబాబు కేసు, దళిత వైద్యుడి మరణం వంటి ఘటనల్లో అప్పటి ప్రభుత్వం ఎలా స్పందించిందో మేధావులు ఆలోచించాలని సూచించారు. దళితులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని ఆరోపించారు.
Also Read
- Minister Kolusu Parthasarathy: ఏపీలో పేదలకు శుభవార్త.. 9 లక్షలకు పైగా ఇళ్ల దరఖాస్తులకు అర్హత
- CM Chandrababu: రెండు నెలల్లో ప్రతీ జిల్లాకు డిస్ట్రిక్ట్ ఎకనామిక్ ప్రొఫైల్.. సీఎం కీలక వ్యాఖ్యలు
- AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. సత్యప్రసాద్కు ముందస్తు బెయిల్.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు రద్దు..
- AP Employee Transfers Ban: ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కొత్త జోనల్ విధానంపై కీలక ఉత్తర్వులు
అమరావతి, మూడు రాజధానులపై వ్యాఖ్యలు
అమరావతిని రాజధానిగా ప్రకటించిన తీర్మానానికి గతంలో వైఎస్ జగన్ మద్దతు తెలిపారని, ఆ విషయాన్ని ఇప్పుడు ఎందుకు విస్మరించారో చెప్పాలని మంత్రి పార్థసారథి ప్రశ్నించారు. అనంతరం మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి ఆయా ప్రాంతాల ప్రజలను అయోమయంలోకి నెట్టారని విమర్శించారు. ప్రస్తుతం అమరావతిలో ప్రశాంత వాతావరణాన్ని కూడా చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రతిపక్ష హోదాపై వ్యాఖ్యలు
వైఎస్ జగన్కు రాజ్యాంగంపై గౌరవం లేదని, అయితే రాజ్యాంగంలో లేని ప్రతిపక్ష హోదాను మాత్రం కోరుతున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్లపై అసభ్య వ్యాఖ్యలు చేయించారని ఆరోపించారు. మరోవైపు.. సోషల్ మీడియాను ప్రభుత్వం మీద అసత్య ప్రచారం కోసం ఉపయోగిస్తే సహించబోమని హెచ్చరించారు. అలాగే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత నటుడు ప్రకాష్ రాజ్కు లేదని వ్యాఖ్యానించారు మంత్రి కొలుసు పార్థసారథి..
తాజావార్తలు
-
Minister Parthasarathy: జగన్పై మంత్రి పార్థసారథి ఫైర్.. విద్వేష రాజకీయాలతో అధికారంలోకి రావాలనుకుంటున్నారు..!
-
Explainer: ‘నెతన్యాహును భూస్థాపితం చేస్తాం..’ ఇది శవయాత్ర కాదు.. ఇరాన్ రణగర్జన..!
-
Naga Vamsi: ‘పెద్ది’ కోసమే సైలెంట్ అయ్యా.. లేదంటే కావాలనే చేశాననేవారు.. అసలు విషయం చెప్పేసిన నాగవంశీ!
-
Minister Kolusu Parthasarathy: ఏపీలో పేదలకు శుభవార్త.. 9 లక్షలకు పైగా ఇళ్ల దరఖాస్తులకు అర్హత
-
VenkyAnil5: సెట్స్పైకి వెంకటేష్.. #VenkyAnil5 షూటింగ్ కు మరింత ఊపు.. కీలక షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!