AP JAC Amaravati: ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ఏపీ జేఏసీ అమరావతి లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP JAC Amaravati Released Press Note About Outsourcing Employees Issue: ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని తాజాగా ఏపీ జేఏసీ అమరావతి ప్రెస్ నోట్ విడుదల చేసింది. రెగ్యులర్, కాంట్రాక్ట్ ప్రధాన ఆర్ధికేతర సమస్యలను చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించిందని.. కానీ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు మాత్రం ఇంకా అపరిస్కృతంగా ఉన్నాయని పేర్కొంది. వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, వాటి పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని వెల్లడించింది. పశుసంవర్థక శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారామెడికల్ స్టాఫ్, ఔట్సోర్సింగ్ లాబ్ అటెండెంట్లకు పెంచిన జీతాలు జనవరి వరకూ చెల్లించారని తెలిపింది. అయితే.. ఆర్ధిక శాఖ ఆమోదం లేదని, ఉద్యోగులు చేయని తప్పుకు ఫిబ్రవరి-2023 నుండి తిరిగి పాత జీతాలు చెల్లించడం చాలా దారుణమని మండిపడింది. ప్రభుత్వం స్పష్టంగా మినిమం టైం స్కేల్ వర్తింపచేయమని ఉత్తర్వులు ఇచ్చినా, కేవలం ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా తక్కువ వేతనాలు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.
Vellampalli Sreenivas: పవన్, అదే జరిగితే నీ పార్టీని మూసేసుకుంటావా.. మాజీ మంత్రి సవాల్
Also Read
- Perni Nani: జగన్ దెబ్బకు సీఆర్డీఏలో 'అవిగన్' తీర్మానం.. కేబినెట్లో పెట్టనున్నారు..!
- Minister Anitha: జగన్ బయటకు వస్తే విధ్వంసమే.. పరామర్శల పేరుతో అరాచకం.. మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు
- Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
గత సంవత్సరం చెల్లించిన వేతనాలు రికవరీ చేయాలని ట్రెజరీ అధికారులు నిర్ణయిస్తున్నారని ఏపీ జేఏసీ అమరావతి ఆ ప్రెస్నోట్లో తెలిపింది. తక్షణమే ప్రభుత్వ ఉత్తర్వులు (GO Ms.No.5) ప్రకారం.. ఏరియర్స్తో సహా గత సంవ్సరం వలే కొత్త వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేసింది. ICPS (చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీస్)లలో పనిచేసే ఉద్యోగులకు.. ప్రధానంగా సోషల్ వర్కర్, ఔట్ రిచ్ వర్కర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆయాలకు చాలా తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఉద్యోగులందరికీ వెంటనే వేతనాలు పెంచాల్సిందిగా కోరింది. స్పోర్ట్స్ అథారిటీలో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న కోచ్లకూ అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని.. వారికి కూడా MTS అమలు చేయాలని కోరుతోంది. రెవెన్యూ శాఖలో వాచ్ & వార్డ్గా శ్రీకాకుళం, అనంతపురం, కృష్ణా, కర్నూల్ జిల్లాలలో పనిచేస్తున్న వందలాది మందికి గత రెండు సంవత్సరాలుగా జీతాలు చెల్లించడం లేదని పేర్కొంది. వైద్య ఆరోగ్య శాఖ బోధనాసుపత్రులలో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు గత సంవత్సరం అక్టోబర్ – 2022లో నియమించబడిన రోజు నుండి నేటికీ జీతాలు ఇవ్వడం లేదని వెల్లడించింది.
Minister Venugopala Krishna: పవన్కి మంత్రి వేణు స్ట్రాంగ్ కౌంటర్.. బాబు ట్రాప్లో..
తాజావార్తలు
-
West Bengal: మసీదు లౌడ్స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
-
Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
-
Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
-
Raksha Bandhan 2026: రక్షా బంధన్ 2026 ఎప్పుడు..? రాఖీ కట్టేందుకు శుభ ముహూర్తం.. గ్రహణం ప్రభావం ఉంటుందా?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!