Deputy CM Pawan Kalyan: ఎకో టూరిజం గమ్యస్థానంగా పులికాట్.. ఫ్లెమింగోల శాశ్వత స్థావరంగా తీర్చిదిద్దుతాం..
- ఎకో టూరిజం గమ్యస్థానంగా పులికాట్...
- ఫ్లెమింగోలు శాశ్వత నివాస స్థావరం గా తీర్చిదిద్దుతాం..
- పులికాట్ సరస్సుకు శీతాకాలం అతిథుల రాక మొదలైంది..
- ఆహారం, విశ్రాంతి నిమిత్తం 3 నెలలు పులికాట్ పరిసరాల్లో ఉంటాయి..
- అందుకే ప్రతి ఏటా ‘ఫ్లెమింగో ఫెస్టివల్’ పేరిట వేడుక చేసుకుంటాం..
- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఎకో టూరిజం గమ్యస్థానంగా పులికాట్.. ఫ్లెమింగోల శాశ్వత నివాస స్థావరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పులికాట్ సరస్సుకు శీతాకాలపు అతిథుల రాక మొదలైంది. వేల కిలోమీటర్లు ప్రయాణించి సైబీరియా నుంచి వచ్చి చేరిన ఫ్లెమింగోలు.. మన అందరికీ కనువిందు చేయడానికి సిద్ధమయ్యాయి. ఆహారం, విశ్రాంతి కోసం వచ్చే ఆరు నెలలపాటు పులికాట్ పరిసరాల్లోనే నివసిస్తాయి. అందుకే ప్రతి ఏడాది ఈ నీటి పక్షుల రాకను ‘ఫ్లెమింగో ఫెస్టివల్’ పేరిట ఘనంగా జరుపుకుంటాం. మూడు రోజుల పండుగకు ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది సందర్శకులు రావడం.. ఈ పక్షులతో మనకున్న అనుబంధానికి నిదర్శనం. మనమందరం ముద్దుగా ‘రాజహంస’ అని పిలిచే ఈ ఫ్లెమింగోలు జీవ వైవిధ్యానికి ప్రతీకలు. అక్టోబర్ లో వచ్చి మార్చిలో తిరిగి వెళ్లే ఈ విదేశీ అతిథులు.. ఇటీవల మాత్రం సంవత్సరం పొడవునా పులికాట్ ప్రాంతంలోనే కనిపిస్తున్నాయి. అంటే, ఇక్కడి వాతావరణం, ఆహారం, భద్రత.. ఇవన్నీ వీటి సహజ జీవనానికి ఎంతగానో అనుకూలిస్తున్నాయనే మాట అన్నారు పవన్..
Read Also: Chevella Bus Accident: 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
Also Read
- Gade Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో పిల్
- Pawan Kalyan: పార్టీ బలోపేతంపై పవన్ కల్యాణ్ ఫోకస్.. 25 మంది పరిశీలకుల ప్రకటన
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. రూ.30,515 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి కొత్త ఊపు..!
- Minister Ramprasad Reddy: ఇక డీజిల్ బస్సులకు గుడ్బై..! త్వరలో 700 ఎలక్ట్రిక్ బస్సులు..
ఇక, ఎకో టూరిజం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా.. ఫ్లెమింగోలు ఇక్కడే శాశ్వత నివాస స్థావరం ఏర్పరుచుకునేలా చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. పక్షుల ఆహారం, విశ్రాంతి, భద్రతకు ఎటువంటి అంతరాయం కలగకుండా అటవీ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈసారి పండుగను కేవలం మూడు రోజులకే పరిమితం చేయకుండా.. ఫోటోగ్రఫీ టూర్స్, బర్డ్ సీయింగ్ క్యాంపులు, ఎకో క్లబ్ కార్యకలాపాలు ప్రారంభించామని చెప్పారు. ఇక, మొంథా తుపాను ప్రభావం సమయంలో కూడా ఫ్లెమింగో నివాస ప్రాంతాలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. రానున్న మూడు నెలల పాటు ఫ్లెమింగో రక్షణపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. పులికాట్ ను ఫ్లెమింగోల శాశ్వత నివాస స్థావరంగా, అలాగే అంతర్జాతీయ ఎకో టూరిజం గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రకటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
Tilak Varma: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. 136 పరుగులు సాధించి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన వర్మ..
-
Qatar LNG Plant Explosion: 12 మంది భారతీయులు సహా 13 మంది మృతి.. అత్యవసర హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: బాల్కొండలో పొలిటికల్ ఫైట్.. ప్రశాంత్ రెడ్డికి చెక్ ఎవరు పెడతారు?
-
Off The Record: ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ స్టార్ట్?
-
T20 World Cup: ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. ‘వెళ్లి షాపింగ్, హోటల్లో డిన్నర్లు చేసుకోండి’..
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!