Minister Ramprasad Reddy: ఇక డీజిల్ బస్సులకు గుడ్బై..! త్వరలో 700 ఎలక్ట్రిక్ బస్సులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Ramprasad Reddy: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పనిచేస్తూ అద్భుత విజయాలు సాధించిందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ పనితీరు, రవాణా శాఖ సంస్కరణలు, సంక్షేమ పథకాల అమలుపై వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు మరింత సులభంగా సేవలు అందించేందుకు వాహన్ యాప్ ద్వారా వాహన రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ల వంటి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. అలాగే సారథి యాప్ ద్వారా డ్రైవింగ్ లైసెన్సులు, ఎల్ఎల్ఆర్ల జారీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
గతంలో వాహనాల ఫిట్నెస్ పరీక్షలు మాన్యువల్ విధానంలో జరిగేవని, ప్రస్తుతం ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి 19 రకాల పరీక్షలను నిర్వహిస్తున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వివరించారు. రోడ్డు భద్రత, సురక్షిత ప్రయాణాల కోసం రవాణా శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటోందని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాల విషయానికి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే ‘స్త్రీ శక్తి’ పథకం విజయవంతంగా అమలవుతోందని తెలిపారు. ఈ పథకం అమలును 24 గంటల పాటు పర్యవేక్షిస్తున్నామని, ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతను పరిశీలిస్తున్నామని చెప్పారు. అలాగే ఆటో డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని వెల్లడించారు.
Also Read
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించి 21 రకాల దివ్యాంగులకు ప్రయోజనం చేకూరుస్తున్నామని తెలిపారు. ఈ పథకాలను ప్రభుత్వం భారంగా కాకుండా బాధ్యతగా భావిస్తోందని స్పష్టం చేశారు. మహిళా ప్రయాణికులకు బస్ స్టాప్లు, బస్ స్టేషన్లలో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని, ఆర్వో ప్లాంట్లు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మహిళలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
రాబోయే రెండు నెలల్లో 700కు పైగా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇకపై డీజిల్ బస్సుల కొనుగోళ్లు చేయబోమని, పర్యావరణ పరిరక్షణ కోసం దశలవారీగా 8,351 ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపైకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏసీ సౌకర్యంతో కూడిన ఎలక్ట్రిక్ బస్సులు నడిపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే 500 సీఎన్జీ బస్సులను అందుబాటులోకి తీసుకురావడానికి త్వరలో టెండర్లు పిలవనున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!