Gade Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో పిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gade Sai Krishna Missing Case: విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ రైట్స్ సంయుక్త కార్యదర్శి దాడిశెట్టి వీరబాబు సోమవారం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సాయికృష్ణ మరణానికి సంబంధించిన అన్ని రికార్డులు, సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా, హాస్పిటల్ రికార్డులు, పోస్టుమార్టం నివేదికలు, ఫోరెన్సిక్ ఆధారాలు తదితర సాక్ష్యాలను వెంటనే భద్రపరచేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. కేసు దర్యాప్తులో స్థానిక పోలీసులు, ప్రభుత్వ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆయన ఆరోపించారు.
పోలీసు అధికారులపైనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో స్థానిక పోలీసుల ద్వారా జరిగే దర్యాప్తుపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని, అందువల్ల స్వతంత్ర సంస్థ అయిన సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న ఏ పోలీసు అధికారినీ దర్యాప్తులో భాగస్వామ్యం చేయకూడదని కూడా కోరారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పులను ప్రస్తావించిన పిటిషనర్, దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగే అవకాశంపై సహేతుకమైన అనుమానం ఉన్నప్పుడు కేసులను సీబీఐకి బదిలీ చేసే అధికారం రాజ్యాంగబద్ధ న్యాయస్థానాలకు ఉందని పేర్కొన్నారు.
Also Read
- Pawan Kalyan: నేడు జనసేన కీలక సమావేశం.. నేతలకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
- AP High Court: రుషికొండ భవనాల వినియోగంపై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు
- Sajjala Ramakrishna Reddy: వైఎస్సార్ సంక్షేమ వారసత్వాన్ని జగన్ కొనసాగిస్తున్నారు.. మళ్లీ వైసీపీ విజయం ఖాయం..
- Minister Narayana: అమరావతి వర్సెస్ మావిగన్.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
అలాగే సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత తీవ్ర హింసకు గురిచేశారని, అనంతరం మరణించినట్లు చూపకుండా ఆధారాలను మాయం చేసే ప్రయత్నాలు జరిగాయని పిటిషన్లో ఆరోపించారు. అయితే ఇవన్నీ పిటిషనర్ చేసిన ఆరోపణలేనని, వాటిపై న్యాయస్థానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. కేసు విచారణ పూర్ణయ్యే వరకు సంబంధిత ఆధారాలు ధ్వంసం కాకుండా తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని, అనంతరం దర్యాప్తును పూర్తిగా సీబీఐకి అప్పగించాలని హైకోర్టును పిటిషనర్ అభ్యర్థించారు.
తాజావార్తలు
-
IMD Weather Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. ఉత్తరాదిన కుండపోత వానలు
-
Manmadha Re-Release: శింబు కల్ట్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘మన్మధ’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్.!
-
Iran: ఖమేనీ నివాసంపై దాడి దృశ్యాలు విడుదల.. అంత్యక్రియల వేళ ఇరాన్ సంచలన వీడియో!
-
Lenin Censor Talk : ‘లెనిన్’ సెన్సార్ టాక్.. పెద్ది లాంటి షాకింగ్ ట్విస్ట్ ఉంటుందట
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
ట్రెండింగ్
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!