Chandrababu Singapore Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బృందం సింగపూర్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతోంది.. రాష్ట్రానికి పెట్టుబడులు, రాజధాని అమరావతి అభివృద్ధియే అజెండాగా సాగుతోన్న ఈ పర్యటనలో కీలక సమావేశాలు, చర్చలు, ఒప్పందాలు కొనసాగుతున్నాయి.. మూడు రోజులుగా బిజీగా గడపుతున్న చంద్రబాబు.. ఇవాళ నాల్గో రోజు కీలక సమవేశాలు నిర్వహించబోతున్నారు.. వివిధ సంస్థలు-సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు..
Read Also: Kajol : నా కుతురుని చూస్తుంటే గర్వంగా ఉంది ..
ఈ రోజు సీఎం చంద్రబాబు టూర్ షెడ్యూల్..
* క్యాపిటాలాండ్ ఇన్వెస్ట్మెంట్ (ఇండియా) సీఈవో సంజీవ్ దాస్గుప్తాతో రియల్ ఎస్టేట్, అర్బన్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ పార్క్లలో పెట్టుబడులపై చర్చించనున్నారు సీఎం చంద్రబాబు..
* ఉదయం 8 గంటలకు మండాయ్ వైల్డ్లైఫ్ గ్రూప్ సీఈవో మైక్ బార్క్లేతో భేటీ.. ఎకో-టూరిజం, బయోడైవర్సిటీ పార్కుల అభివృద్ధి, వైల్డ్లైఫ్ ఎడ్యుకేషన్ మోడల్స్పై చర్చ
* ఉదయం 8:30 గంటలకు ఎస్ఎంబీసీ బ్యాంక్-ఇండియా డివిజన్, మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ కన్నన్తో సమావేశం.. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు గల అవకాశాలు, లిక్విడిటీ మోడల్స్పై చర్చ
* ఉదయం 9 గంటలకు టెమసెక్ కంపెనీ జాయింట్ హెడ్–పోర్ట్ఫోలియో డెవలప్మెంట్ దినేశ్ ఖన్నాతో భేటీ.. పబ్లిక్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, ఎడ్యుకేషన్-హెల్త్ ఫండింగ్పై సహకారాన్ని కోరనున్న సీఎం చంద్రబాబు
* ఉదయం 10 గంటలకు సింగపూర్ విదేశాంగ మంత్రి డాక్టర్ వివియన్ బాలకృష్ణన్తో ముఖ్యమంత్రి సమావేశం.. భారత్–సింగపూర్ సంబంధాలు, తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహం అంశాలపై చర్చ
* ఉదయం 11 గంటలకు నేషనల్ సెక్యూరిటీ & హోం అఫైర్స్ మంత్రి కే. షణ్ముగంతో విందు.. సెక్యూరిటీ కెపాసిటీ బిల్డింగ్, పోలీస్ ట్రైనింగ్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అంశాలపై చర్చ
* రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు సెంబ్క్రాప్ సీఓఓ చార్లెస్ కోతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం.. రెన్యువబుల్ ఎనర్జీ, వాటర్ ట్రీట్మెంట్ ప్రాజెక్టులపై సహకారానికి సంబంధించి పలు ప్రతిపాదనలు చెయ్యనున్న సీఎం చంద్రబాబు..