CM Chandrababu: అసలుసిసలు తెలుగు బిడ్డ పీవీ.. ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం..
- ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు..
- ది లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పీవీ నరసింహారావు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం..
- నేను చాలా అదృష్టవంతుడిని.. పీవీతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది..
- పీవీ భారత ముద్ద బిడ్డ, భారత రత్న.. అసలుసిసలు తెలుగు బిడ్డ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: నేను చాలా అదృష్టవంతుడిని.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో కలిసి పనిచేసే అవకాశం లభించింది అని గుర్తుచేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. పీఎం మ్యూజియంలో జరిగే “ది లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పీవీ నరసింహారావు” అనే కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఆ క్రమంలో 6వ సంస్మరణ ప్రసంగం చేశారు.. పీవీ భారత ముద్ద బిడ్డ, భారత రత్న.. అసలుసిసలు తెలుగు బిడ్డ అని కీర్తించారు.. ఆయనతో నాకు మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవని గుర్తుచేసుకున్నారు.. 17 భాషల్లో పీవీ నిష్ణాతుడు.. కానీ, ప్రస్తుతం హిందీ భాష నేర్చుకోవడం పై పెద్ద రాద్దాంతం చేస్తున్నాం అని విమర్శించారు.
Read Also: SSMB 29 : మహేశ్ మూవీ కోసం అంతా కొత్తవాళ్లే.. జక్కన్న ప్లాన్ ఏంటి..?
Also Read
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
- CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
ఎంతో సంయమనం, ఆలోచనపరమైన దార్శనికుడు, రాజనీతిజ్ఞుడు పీవీ అంటూ కొనియాడారు చంద్రబాబు.. గతంలో భారత ఆర్ధికాభివృద్ది రేటు 3 నుంచి 5 శాతం ఉండేది.. గతంలో భారత దేశానికి చెందిన బంగారాన్ని తాకట్టు పెట్టే పరిస్థితుల్లో ఉన్నాం.. పిల్లి రంగు నలుపా, తెలుపా అనే వ్యత్యాసంతో చూడరాదు.. ఎలుకను పట్టుకునే పిల్లి అయితే చాలు అన్నారు చంద్రబాబు.. సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకోవాలి. సరిగ్గా అదే చేశారు పీవీ నరసింహారావు అని తెలిపారు.. 1991లో దివంగత పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్ధిక సంస్కరణల ఫలాలను ఇప్పుడు దేశ ప్రజలంతా అనుభవిస్తున్నారు.. అన్ని పార్టీల మధ్య రాజకీయ ఏకాభిప్రాయం సాధించడంలో అసాధారణ ప్రతిభాశాలి పీవీ అంటూ ప్రశంసలు కురిపించారు చంద్రబాబు.
Read Also: Sant Tukaram Movie: తెలుగు హీరో డైరెక్టర్ గా ‘సంత్ తుకారాం’ జూలై 18న విడుదల
2014లో ప్రపంచంలో 11వ ఆర్ధిక శక్తిగా భారత్ ఉంది.. 2028 కల్లా భారత్ మూడవ ఆర్ధిక శక్తిగా ఆవిర్భవిస్తామన్న విశ్వాసం నాకు ఉందన్నారు చంద్రబాబు.. 2047 కల్లా భారత్ ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్ధిక శక్తిగా ఆవిర్భవిస్తామనడంలో ఏమాత్రం సందేహం లేదన్నారు.. 1991లో పీవీ నరసింహారావు ఆర్ధిక సంస్కరణలు అమలు చేయడం ప్రారంభించారు.. అప్పట్లో 3 నుంచి 4 వరకు భారత్ ఆర్థికాభివృద్ధి రేటు ఉండేది.. ప్రస్తుతం భారత్ ఆర్థికాభివృద్ధి రేటు 6 నుంచి 7 వరకు ఉంది. 2047 కల్లా భారత్ వృద్ధి రేటు 10కి మించి ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Top 5 Expensive Phones: భారత్లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్ఫోన్లు.. 2TB స్టోరేజ్, ధరలు తెలిస్తే షాక్!
-
Putin-Ajit Doval: పుతిన్కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!