AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై ఫోకస్.. వారికి శుభవార్త..!
- నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం..
- ఉదయం 11 గంటలకు సచివాలయంలో భేటీ..
- మంత్రివర్గ సమావేశం ముందు కీలక అజెండా..
- మహిళలకు, గీత కులవృత్తిదారులకు గుడ్న్యూస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Meeting: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది.. ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశం ముందు కీలక అజెండాను సిద్ధం చేశారు అధికారులు.. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించబోతోంది కేబినెట్.. ఇక, మహిళలకు, గీత కులవృత్తిదారులకు గుడ్న్యూస్ చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.. ముఖ్యంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం.. గ్రామీణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్ల నిర్వహణకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చించనున్నారు.. ఇక, గీత కులవృత్తులవారికి 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై చర్చించి ఓ నిర్ణయానికి రానుంది కేబినెట్.. మరోవైపు.. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన కొన్ని సంస్థలకు భూ కేటాయింపులపై కూడా నిర్ణయం తీసుకోనుంది ఏపీ కేబినెట్.. మరోవైపు ఎల్లుండి దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా సాగుతోన్న ఈ పర్యటకు సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రులకు వివరించే అవకాశం ఉందంటున్నారు..
Read Also: Delhi Election 2025: ఏఐ కంటెంట్కు లేబులింగ్ తప్పనిసరి చేయాల్సిందే: ఈసీ
Also Read
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
- AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఉదయం 11 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది. ఈ సమావేశం రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమాలు మరియు ముఖ్యమైన సమస్యలపై దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయాలనేది ఒక ముఖ్యమైన ఎజెండా అంశం. అదనంగా, విస్తృత సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా రైతులకు ఇచ్చిన హామీలను మంత్రివర్గం చర్చించవచ్చు. ఎజెండాలోని ఇతర ముఖ్య అంశాలు బహుళ కంపెనీలకు భూమి కేటాయింపు, ఇది ఈ ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధికి కొత్త అవకాశాలను సూచిస్తుంది. మద్యం దుకాణాలలో గీత కార్మికులకు 10 శాతం కేటాయింపు అనే వివాదాస్పద అంశంపై కూడా మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది.. ఇక, బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల లేవనెత్తిన అభ్యంతరాలను కూడా ఈ సమావేశంలో పరిశీలిస్తారు, దీనివల్ల అంతర్-రాష్ట్ర సంబంధాలు మరియు జల వనరుల నిర్వహణ చర్చనీయాంశంగా మారనుంది.. కేబినెట్ సమావేశం తర్వాత, ముఖ్యమంత్రి తాజా రాజకీయ పరిణామాలు మరియు అదనపు ముఖ్యమైన అంశాలపై మంత్రులతో చర్చించి, ఆంధ్రప్రదేశ్లో పాలన మరియు ప్రజా సంక్షేమానికి సమగ్ర విధానాన్ని నిర్ధేశించనున్నారు.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!