AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై ఫోకస్.. వారికి శుభవార్త..!
- నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం..
- ఉదయం 11 గంటలకు సచివాలయంలో భేటీ..
- మంత్రివర్గ సమావేశం ముందు కీలక అజెండా..
- మహిళలకు, గీత కులవృత్తిదారులకు గుడ్న్యూస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Meeting: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది.. ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశం ముందు కీలక అజెండాను సిద్ధం చేశారు అధికారులు.. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించబోతోంది కేబినెట్.. ఇక, మహిళలకు, గీత కులవృత్తిదారులకు గుడ్న్యూస్ చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.. ముఖ్యంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం.. గ్రామీణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్ల నిర్వహణకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చించనున్నారు.. ఇక, గీత కులవృత్తులవారికి 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై చర్చించి ఓ నిర్ణయానికి రానుంది కేబినెట్.. మరోవైపు.. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన కొన్ని సంస్థలకు భూ కేటాయింపులపై కూడా నిర్ణయం తీసుకోనుంది ఏపీ కేబినెట్.. మరోవైపు ఎల్లుండి దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా సాగుతోన్న ఈ పర్యటకు సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రులకు వివరించే అవకాశం ఉందంటున్నారు..
Read Also: Delhi Election 2025: ఏఐ కంటెంట్కు లేబులింగ్ తప్పనిసరి చేయాల్సిందే: ఈసీ
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఉదయం 11 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది. ఈ సమావేశం రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమాలు మరియు ముఖ్యమైన సమస్యలపై దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయాలనేది ఒక ముఖ్యమైన ఎజెండా అంశం. అదనంగా, విస్తృత సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా రైతులకు ఇచ్చిన హామీలను మంత్రివర్గం చర్చించవచ్చు. ఎజెండాలోని ఇతర ముఖ్య అంశాలు బహుళ కంపెనీలకు భూమి కేటాయింపు, ఇది ఈ ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధికి కొత్త అవకాశాలను సూచిస్తుంది. మద్యం దుకాణాలలో గీత కార్మికులకు 10 శాతం కేటాయింపు అనే వివాదాస్పద అంశంపై కూడా మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది.. ఇక, బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల లేవనెత్తిన అభ్యంతరాలను కూడా ఈ సమావేశంలో పరిశీలిస్తారు, దీనివల్ల అంతర్-రాష్ట్ర సంబంధాలు మరియు జల వనరుల నిర్వహణ చర్చనీయాంశంగా మారనుంది.. కేబినెట్ సమావేశం తర్వాత, ముఖ్యమంత్రి తాజా రాజకీయ పరిణామాలు మరియు అదనపు ముఖ్యమైన అంశాలపై మంత్రులతో చర్చించి, ఆంధ్రప్రదేశ్లో పాలన మరియు ప్రజా సంక్షేమానికి సమగ్ర విధానాన్ని నిర్ధేశించనున్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!