AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై ఫోకస్.. వారికి శుభవార్త..!
- నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం..
- ఉదయం 11 గంటలకు సచివాలయంలో భేటీ..
- మంత్రివర్గ సమావేశం ముందు కీలక అజెండా..
- మహిళలకు, గీత కులవృత్తిదారులకు గుడ్న్యూస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Meeting: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది.. ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశం ముందు కీలక అజెండాను సిద్ధం చేశారు అధికారులు.. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించబోతోంది కేబినెట్.. ఇక, మహిళలకు, గీత కులవృత్తిదారులకు గుడ్న్యూస్ చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.. ముఖ్యంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం.. గ్రామీణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్ల నిర్వహణకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చించనున్నారు.. ఇక, గీత కులవృత్తులవారికి 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై చర్చించి ఓ నిర్ణయానికి రానుంది కేబినెట్.. మరోవైపు.. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన కొన్ని సంస్థలకు భూ కేటాయింపులపై కూడా నిర్ణయం తీసుకోనుంది ఏపీ కేబినెట్.. మరోవైపు ఎల్లుండి దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా సాగుతోన్న ఈ పర్యటకు సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రులకు వివరించే అవకాశం ఉందంటున్నారు..
Read Also: Delhi Election 2025: ఏఐ కంటెంట్కు లేబులింగ్ తప్పనిసరి చేయాల్సిందే: ఈసీ
Also Read
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఉదయం 11 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది. ఈ సమావేశం రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమాలు మరియు ముఖ్యమైన సమస్యలపై దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయాలనేది ఒక ముఖ్యమైన ఎజెండా అంశం. అదనంగా, విస్తృత సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా రైతులకు ఇచ్చిన హామీలను మంత్రివర్గం చర్చించవచ్చు. ఎజెండాలోని ఇతర ముఖ్య అంశాలు బహుళ కంపెనీలకు భూమి కేటాయింపు, ఇది ఈ ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధికి కొత్త అవకాశాలను సూచిస్తుంది. మద్యం దుకాణాలలో గీత కార్మికులకు 10 శాతం కేటాయింపు అనే వివాదాస్పద అంశంపై కూడా మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది.. ఇక, బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల లేవనెత్తిన అభ్యంతరాలను కూడా ఈ సమావేశంలో పరిశీలిస్తారు, దీనివల్ల అంతర్-రాష్ట్ర సంబంధాలు మరియు జల వనరుల నిర్వహణ చర్చనీయాంశంగా మారనుంది.. కేబినెట్ సమావేశం తర్వాత, ముఖ్యమంత్రి తాజా రాజకీయ పరిణామాలు మరియు అదనపు ముఖ్యమైన అంశాలపై మంత్రులతో చర్చించి, ఆంధ్రప్రదేశ్లో పాలన మరియు ప్రజా సంక్షేమానికి సమగ్ర విధానాన్ని నిర్ధేశించనున్నారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!