AP Assembly Panel Speakers: ఏపీ అసెంబ్లీకి కొత్త ప్యానల్ స్పీకర్లు.. ఆరుగురి పేర్లు ప్రకటించిన స్పీకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Assembly Panel Speakers: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్యానల్ స్పీకర్లను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. శాసనసభ కార్యకలాపాలను సజావుగా నిర్వహించడంలో భాగంగా ఆరుగురు సభ్యులను ప్యానల్ స్పీకర్లుగా నియమించారు. ప్యానల్ స్పీకర్లుగా మండలి బుద్ధ ప్రసాద్, కోళ్ల లలిత కుమారి, జ్యోతుల నెహ్రూ, విష్ణుకుమార్ రాజు, వరద రాజుల రెడ్డి, దాసరి సుధలను నియమించినట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. శాసనసభ సమావేశాల సమయంలో స్పీకర్ అందుబాటులో లేని సందర్భాల్లో సభా కార్యక్రమాలను నిర్వహించడంలో ప్యానల్ స్పీకర్లు కీలక పాత్ర పోషిస్తారు. తాజాగా ప్రకటించిన ఈ నియామకాలతో సభా వ్యవహారాలు మరింత సజావుగా కొనసాగేందుకు అవకాశం ఉంటుంది.
మరోవైపు.. డీఎస్సీ (DSC)తో పాటు ఇతర అంశాలపై వైసీపీ అధినేత జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు బయట, రోడ్లపై మాట్లాడటం కాకుండా ఏమైనా అనుమానాలు, సందేహాలు ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సూచించారు. సభలోనే ప్రభుత్వం సమాధానం ఇస్తుందని స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు.. ఎక్కడో రోడ్లపై మాట్లాడిన అంశాలకు సమాధానం చెప్పాలంటే ఎలా అని ప్రశ్నించారు. జగన్ ఎమ్మెల్యేగా, ఆయన పార్టీకి చెందిన సభ్యులు శాసనసభకు వచ్చి తమ సమస్యలు, అనుమానాలను సభలో ప్రస్తావించాలని సూచించారు. జగన్కు ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో జగన్కు ప్రతిపక్ష నేత హోదా తాను ఎలా ఇవ్వగలనని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత హోదా అంశంపై గతంలోనూ తన వైఖరిని స్పష్టం చేసినట్లు తెలిపారు.
Also Read
- CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
- Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అయ్యన్నపాత్రుడు సూచించారు. సభలో సంబంధిత మంత్రులు అందుబాటులో ఉంటారని, ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలకు మంత్రులతో సమాధానాలు ఇప్పించే బాధ్యతను స్పీకర్గా తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. డీఎస్సీ నియామకాలు, ఇతర ప్రభుత్వ అంశాలపై వైసీపీకి ఏవైనా సందేహాలు ఉంటే వాటిని అసెంబ్లీ వేదికగా లేవనెత్తితే ప్రభుత్వం సమాధానం చెప్పే అవకాశం ఉంటుందని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై చర్చకు శాసనసభే సరైన వేదిక అని స్పష్టం చేశారు శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు..
తాజావార్తలు
-
Bigg Boss 10 Telugu Live: బిగ్బాస్ సీజన్ 10 లైవ్ అప్డేట్స్.. హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు కంటెస్టెంట్స్..
-
NTR Bharosa Pensions: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు.. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇలా..
-
Iran-Israel War: ఒకేసారి నాలుగు వైపుల నుంచి ఇజ్రాయెల్పై దాడి? ఇరాన్ భారీ వ్యూహం
-
Temple Tourism: అమరావతికి సరికొత్త కాంతి.. తిరుమల తర్వాత ఆ స్థాయిలో అక్కడ శ్రీవారి క్షేత్రం..
-
Harish Rao : అసెంబ్లీలో కాంగ్రెస్కు చుక్కలు చూపిస్తాం
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!