Stop Diarrhoea Campaign: రేపటి నుంచి ‘స్టాప్ డయేరియా’ కార్యక్రమం.. 37.53 లక్షల చిన్నారులకు ఉచిత ఓఆర్ఎస్, జింక్ మాత్రలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stop Diarrhoea Campaign: రాష్ట్రంలో డయేరియా నివారణకు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ‘స్టాప్ డయేరియా’ పేరుతో చేపట్టనున్న ఈ కార్యక్రమం మంగళవారం నుంచి ప్రారంభమై జులై 31వ తేదీ వరకు కొనసాగనుంది. ఐదేళ్లలోపు చిన్నారులను డయేరియా బారిన పడకుండా కాపాడడం, వ్యాధిపై అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 37.53 లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారులకు ఉచితంగా రెండు ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లు, 14 జింక్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. గ్రామాలు, పట్టణాల్లోని చిన్నారుల ఇళ్లకు, అంగన్వాడీ కేంద్రాలకు ఎఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు వెళ్లి ఈ మందులను అందజేయనున్నారు.
అలాగే డయేరియా లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే చిన్నారులకు కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ మాత్రలను ఉచితంగా అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం కోసం 95,37,141 ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 5,25,53,908 జింక్ మాత్రలను సిద్ధం చేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. డయేరియా భారతదేశంలో అధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో ఐదో స్థానంలో ఉందని అధికారులు గుర్తు చేశారు. ముఖ్యంగా చిన్నారుల్లో డయేరియా వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో నివారణ చర్యలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.
Also Read
- Minister Parthasarathy: జగన్పై మంత్రి పార్థసారథి ఫైర్.. విద్వేష రాజకీయాలతో అధికారంలోకి రావాలనుకుంటున్నారు..!
- Minister Kolusu Parthasarathy: ఏపీలో పేదలకు శుభవార్త.. 9 లక్షలకు పైగా ఇళ్ల దరఖాస్తులకు అర్హత
- CM Chandrababu: రెండు నెలల్లో ప్రతీ జిల్లాకు డిస్ట్రిక్ట్ ఎకనామిక్ ప్రొఫైల్.. సీఎం కీలక వ్యాఖ్యలు
- AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. సత్యప్రసాద్కు ముందస్తు బెయిల్.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు రద్దు..
అయితే డయేరియా నియంత్రణలో రాష్ట్రం పురోగతి సాధించినట్లు తాజా జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే (NFHS-6) గణాంకాలు చెబుతున్నాయి. ఐదేళ్లలోపు చిన్నారుల్లో డయేరియా కేసుల శాతం గతంలో 7.2 శాతంగా ఉండగా, ప్రస్తుతం 4.8 శాతానికి తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. జులై 31 వరకు నిర్వహించే ‘స్టాప్ డయేరియా’ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత, సురక్షిత తాగునీటి వినియోగం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించనున్నారు. డయేరియా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య శాఖ ప్రజలకు సూచించింది.
తాజావార్తలు
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
Anirudh vs Sai Abhayankar: అనిరుద్ vs అభయంకర్.. ఇదెక్కడి పోటీ మావా?
-
Vaibhav Suryavanshi: మూడో టీ20కి ముందు టీమిండియాకు షాక్.. నెట్స్లో గాయపడ్డ ఓపెనర్ వైభవ్! ఇప్పుడు ఎలా ఉన్నాడంటే?
-
Siya Goyal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. 4 నెలల ముందే సియా-చేతన్ వివాహం!
-
YRF : స్పై యూనివర్స్ కి ఎండ్ కార్డు?
ట్రెండింగ్
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!