Andhra Pradesh: ఎన్టీఆర్ వైద్యసేవ, ఆరోగ్యశ్రీపై సర్కార్ కీలక నిర్ణయం..
- ఎన్టీఆర్ వైద్యసేవ, ఆరోగ్యశ్రీపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- కోటి 40 లక్షలకు పైగా కుటుంబాలకు బీమా చేయించి వైద్య సేవలు..
- హైబ్రిడ్ ఇన్సూరెన్స్ విధానం అమలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవ, ఆరోగ్యశ్రీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో బీపీఎల్లో ఉన్న కోటి 40 లక్షలకు పైగా కుటుంబాలకు బీమా చేయించి వైద్య సేవలు అందించనుంది ప్రభుత్వం.. హైబ్రిడ్ ఇన్సూరెన్స్ విధానం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం అన్నారు మంత్రి సత్యకుమార్.. ఈ ఏడాది ఏప్రిల్ 1 తేదీ నుంచి బీమా విధానంలో ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.. ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవ, ఇన్సూరెన్స్ కంపెనీలు సంయుక్తంగా హైబ్రిడ్ బీమా విధానంలో వైద్య సేవలు అందిస్తాయన్నారు మంత్రి..
Read Also: TDR Bonds: టీడీఆర్ బాండ్లపై కీలక ఆదేశాలు.. అవి మినహా మిగతావి రిలీజ్..
Also Read
- Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
- Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
- Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక విధాన నిర్ణయాలపై ఫోకస్..
మొత్తం 1.43 కోట్ల కుటుంబాలకు భీమా విధానంలో వైద్య సేవలు అందేలా హైబ్రిడ్ విధానం ఉంటుందన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. 90 శాతం క్లెయిమ్లు రూ.2.5 లక్షల లోపే ఉంటున్నరాయన్న ఆయన.. రూ.2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు వ్యయం భరించేలా కొత్త విధానం అమలు చేయనున్నట్టు వెల్లడించారు.. హైబ్రిడ్ విధానంలో ప్రతీ కుటుంబానికి రూ.2,500 వరకూ ప్రీమియం ఉంటుంది.. ఆస్పత్రులకు బిల్లులురావనే ఇబ్బంది లేకుండా, రోగులను ఇబ్బందులకు గురి చేయకుండా ఇన్సూరెన్స్ కంపెనీలు బిల్లులు చెల్లించేవిధంగా చర్యలు ఉంటాయన్నారు.. 2.5 లక్షల మించి వ్యయం అయితే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా చెల్లింపు ఉంటాయని.. అడ్మిట్ అయిన ఆరు గంటల్లో గా అప్రూవల్ ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు.. చికిత్సలకు సంబంధించి గతంలో జరిగిన అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం.. కొత్త హైబ్రిడ్ విధానంలోనూ 3,257 చికిత్సా విధానాలకు వర్తింపజేయనున్నట్టు వెల్లడించారు మంత్రి సత్యకుమార్ యాదవ్..
తాజావార్తలు
-
PF Money: ఉద్యోగం మారిన తర్వాత పీఎఫ్ విషయంలో ఈ తప్పు చేస్తే భారీ నష్టం తప్పదు!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజమిదే!
-
TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
-
Crime Thriller OTT : మనిషి శరీరానికి జంతువుల తలలను తగిలించే సైకో… ఓటీటీలో భయపెడుతున్న ఇంటెన్స్ థ్రిల్లర్
-
Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు కోహ్లీ దూరం.!
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!