Amaravati Capital Development: అమరావతికి చట్టబద్ధత.. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Capital Development: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వేలాది మంది కార్మికులు పని చేస్తున్నారు.. నిర్మాణ పనులు జరుగుతున్నాయి.. అయితే, అమరావతి.. చట్టబద్ధత బిల్లుకు ఆమోదం రావడంతో ప్రభుత్వం పై మరింత బాధ్యత పెరగనుంది. బాధ్యత పెరగడమే… కాదు. ఒత్తిడి కూడా పెరుగుతోంది.. కూటమి ప్రభుత్వం. అమరావతి.. నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుతం అమరావతి నిర్మాణాలు ఒక టైం లైన్ ప్రకారం జరుగుతూ ఉన్నాయి.. అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్లు.. ట్రంక్ రోడ్లు.. అమరావతి లే ఔట్లు.. ఇలా అన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి.. అటు ఇటుగా ఒక రెండేళ్ల టైం బాండ్ లో వీటి నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది.. 2028 మే నుంచి.. ఆగస్టు లోపు. ఈ నిర్మాణాలు పూర్తి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది… అయితే, ఇప్పుడు అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదంతో ప్రభుత్వంపై ఒత్తిడి మరింత గా పెరుగుతోంది..
ఇప్పటి వరకు చట్టబద్ధత లేకపోవడంతో ప్రభుత్వం రాజధాని పనుల విషయంలో ఒత్తిడి పెంచలేదు.. కానీ, ఇప్పుడు… చట్టబద్ధత రావడం ప్రభుత్వం వైపు నుంచి ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉంది… రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడుస్తున్నా.. ఏపీకి సరైన రాజధాని లేదు.. గత ప్రభుత్వంలో రాజధాని విషయంలో జరిగిన తప్పులను ప్రభుత్వం పదే పదే ఎత్తి చూపుతోంది.. దీంతో… ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై రాజధాని పూర్తి చేసే బాధ్యత పడింది.. అందులోనూ కూటమి అధికారం లోకి వచ్చి ఇంకా రెండేళ్లు కూడా పూర్తి కాలేదు.. మూడేళ్లకు పైగా టైం ఉంది.. దీంతో, ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంది. రాజధాని పనులు త్వరగా పూర్తి చేసి.. ప్రధాని మోడీని మరోసారి రాష్ట్రానికి పిలిపించే ఆలోచనలో ఉన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
Also Read
అమరావతి రాజధాని పనులు నిరంతర ప్రక్రియ అని సీఎం చంద్రబాబు చెబుతున్నారు… అంటే.. ఈ మూడేళ్లలో కొన్ని నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యే అవకాశం ఉంది.. మిగిలినవి ఇంకా టైం పట్టె పరిస్థితి కనిపిస్తోంది.. మరి, అమరావతి చట్టబద్ధత గెజిట్ వచ్చాక.. ప్రభుత్వం రాజధాని విషయంలో ఇంకెంత దూకుడుగా ముందుకు వెళ్తుందో చూడాల్సి ఉంది..
తాజావార్తలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
-
Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?