Amaravati Projects: అమరావతిలో నేడు కీలక ప్రాజెక్టుల ప్రారంభం.. సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Projects: కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. అభివృద్ధి పనులను వేగంగా చేపడుతూ ముందుకు సాగుతోంది.. రాజధాని అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి నేడు పలు కీలక కార్యక్రమాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి. ఉండవల్లి సమీపంలో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని సీఎం ప్రారంభించనుండగా, సీడ్ యాక్సిస్ రోడ్డును కూడా ప్రజలకు అంకితం చేయనున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో రహదారి, రవాణా సదుపాయాలను మెరుగుపరిచే దిశగా ఈ ప్రాజెక్టులు కీలకంగా నిలుస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు మరింత సౌలభ్యం కలగనుంది.
స్టీల్ బ్రిడ్జి ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం సీడ్ యాక్సిస్ రోడ్డుకు భూములు ఇచ్చిన రైతులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి, అనంతరం సమావేశంలో ప్రసంగించనున్నారు. ఇదిలా ఉండగా, గుంటూరు ఛానల్పై నిర్మించిన మరో స్టీల్ బ్రిడ్జిని కూడా సీఎం పరిశీలించనున్నారు. అనంతరం రాయపూడి చేరుకుని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (జీఏడీ)కి అప్పగించిన ప్రజా ప్రతినిధుల భవనాలను పరిశీలించనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మించిన హౌసింగ్ ప్రాజెక్టును కూడా జీఏడీకి అప్పగించే కార్యక్రమం ఉండనుంది. రాజధాని ప్రాంతంలో కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తుండటంతో అమరావతి అభివృద్ధిలో ఇది మరో కీలక ముందడుగుగా ప్రభుత్వం పేర్కొంటోంది.
Also Read
సీఎం చంద్రబాబు షెడ్యూల్
* ఉదయం 10:20 గంటలకు: ఉండవల్లిలోని నివాసం నుంచి సీఎం చంద్రబాబు బయలుదేరుతారు.
* ఉదయం 10:35 గంటలకు: ఉండవల్లి సమీపంలోని స్టీల్ బ్రిడ్జిపై వాహనాల రాకపోకలకు పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారు.
* అనంతరం: స్టీల్ బ్రిడ్జి నిర్మాణాలను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు.
* ఉదయం 10:45 నుంచి 11:50 గంటల వరకు: సీడ్ యాక్సిస్ రోడ్డుకు భూములు ఇచ్చిన రైతులతో సీఎం సమావేశమవుతారు.
* రైతుల సమావేశంలో: సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు.
* ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:10 గంటల వరకు: గుంటూరు ఛానల్పై నిర్మించిన మరో స్టీల్ బ్రిడ్జిని పరిశీలిస్తారు.
* అనంతరం: రాయపూడికి చేరుకుని జీఏడీకి అప్పగించిన ప్రజా ప్రతినిధుల భవనాలను సీఎం పరిశీలిస్తారు.
తాజావార్తలు
-
Amaravati Projects: అమరావతిలో నేడు కీలక ప్రాజెక్టుల ప్రారంభం.. సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Nepal Violence: భారత సరిహద్దులో ఐఎస్ఐ కుట్ర? నేపాల్ అల్లర్లలో పాకిస్థానీ మత గురువు..
-
Mr Perfect Copyright Case: దిల్రాజుకు సుప్రీంకోర్టులో ఊరట.. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కాపీరైట్ కేసులో కీలక పరిణామం!
-
YS Jagan Kurnool Tour: కర్నూలులో నేడు జగన్ పర్యటన.. పోలీసుల అనుమతి.. షరతులు ఇవే..!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..