Amaravati Iconic Bridge: అమరావతి ఐకానిక్ వంతెన నమూనా ఎంపిక..
- అమరావతి ఐకానిక్ వంతెన నమూనా ఎంపిక..
- హైదరాబాద్-అమరావతి మధ్య తగ్గనున్న 35 కిలోమీటర్ల దూరం..
- అమరావతిని అనుసంధానం చేస్తూ ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మణం..
- ఐకానిక్ వంతెన డిజైన్ను ఖరారు చేసిన సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Iconic Bridge: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఐకానిక్ వంతెన నమూనా ఫైనల్ అయింది. ఈ వంతెన నిర్మాణం పూర్తైతే హైదరాబాద్ – అమరావతి మధ్య దూరం సుమారు 35 కిలో మీటర్ల తగ్గనుంది. ఇక, అమరావతిని అనుసంధానించే దిశగా ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మాణానికి సంబంధించిన డిజైన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. ఇటీవల నాలుగు నమూనాలను సీఆర్డీఏ వెబ్సైట్లో ఉంచి ప్రజల అభిప్రాయ తీసుకున్నారు. అందులో రెండో ఆప్షన్కు దాదాపుగా 14 వేల ఓట్లు రావడంతో అదే నమూనా ఎంపికైంది.
Read Also: Uttar Pradesh: అన్నయ్య మరణం తట్టుకోలేక.. చెల్లి ఏం చేసిందంటే…
Also Read
- Andhra Pradesh: ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 44.89 లక్షల మంది ఆచూకీ లేని ఓటర్లు
- Single-Teacher Schools: సింగిల్ టీచర్ పాఠశాలలపై హైకోర్టులో పిల్.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
- Sajjala Ramakrishna Reddy: 2029లో వైసీపీదే అధికారం.. భారీ మెజారిటీతో గెలుస్తాం..
- Deputy CM Pawan Kalyan: సాగునీటి సంక్షోభంపై పవన్ సమీక్ష.. ప్రత్యామ్నాయ చర్యలకు ఆదేశాలు
అయితే, ఇప్పటికే ఈ నమూనాకు సంబంధించిన డీపీఆర్ సిద్ధమైంది. అమరావతిలోని ఎన్–19 రోడ్డును ఎన్హెచ్–65 (విజయవాడ–హైదరాబాద్ రహదారి)తో అనుసంధానం చేసేలా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. రూ.2,500 కోట్ల వ్యయం అయ్యే ఈ ప్రాజెక్టుకు త్వరలోనే టెండర్లను ఏపీ ప్రభుత్వం పిలవనుంది. కాగా, ఎరుపు, తెలుపు రంగుల్లో జంట పైలాన్లతో రూపుదిద్దుకునే ఈ ఐకాన్ వంతెన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు 5.22 కిలో మీటర్ల పొడవున కేబుల్ బ్రిడ్జ్ ను నిర్మించనున్నారు.
Read Also: TheyCallHimOG Bookings : ‘OG’ నైజాం బుకింగ్స్ ఓపెన్ చేసేందుకు డేట్ ఫిక్స్..
ఇక, ప్రస్తుతం ఎన్హెచ్–65 నుంచి అమరావతికి చేరుకోవాలంటే మూలపాడు, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, కనకదుర్గ వంతెన, ప్రకాశం బ్యారేజ్ మీదుగా 40 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది. ఈ ఐకానిక్ వంతెన పూర్తైతే మూలపాడు నుంచి కేవలం 5 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తే అమరావతిలోకి నేరుగా ప్రవేశం లభిస్తుంది. ఈ వంతెన నిర్మాణంతో సుమారు 35 కిలో మీటర్ల దూరం తగ్గి, గంటన్నర సమయం ఆదా కానుందని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Huawei MatePad 11.5 2026: హువావే మేట్ప్యాడ్ 11.5 భారత్లో లాంచ్.. 10,100mAh బ్యాటరీ, 120Hz పేపర్మ్యాట్ డిస్ప్లే
-
Tilak Varma: స్టార్ బాయ్కి ప్రమోషన్.. సౌత్ జోన్ కెప్టెన్గా ఛాన్స్.!
-
Trump: ట్రంప్ కీలక ప్రకటన.. ఇరాన్పై కొత్త దాడులకు బ్రేక్..
-
Ghattamaneni Aadiseshagirirao : పద్మాలయ స్టూడియోస్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే భాద్యత జై కృష్ణపై ఉంది
-
CWG 2026 Medals: ఒక్క రోజులో 16 పతకాలు.. పాయింట్స్ పట్టికలో ఆరు స్థానాలు ఎగబాకిన భారత్.!
ట్రెండింగ్
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!