Amaravati Iconic Bridge: అమరావతి ఐకానిక్ వంతెన నమూనా ఎంపిక..
- అమరావతి ఐకానిక్ వంతెన నమూనా ఎంపిక..
- హైదరాబాద్-అమరావతి మధ్య తగ్గనున్న 35 కిలోమీటర్ల దూరం..
- అమరావతిని అనుసంధానం చేస్తూ ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మణం..
- ఐకానిక్ వంతెన డిజైన్ను ఖరారు చేసిన సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Iconic Bridge: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఐకానిక్ వంతెన నమూనా ఫైనల్ అయింది. ఈ వంతెన నిర్మాణం పూర్తైతే హైదరాబాద్ – అమరావతి మధ్య దూరం సుమారు 35 కిలో మీటర్ల తగ్గనుంది. ఇక, అమరావతిని అనుసంధానించే దిశగా ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మాణానికి సంబంధించిన డిజైన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. ఇటీవల నాలుగు నమూనాలను సీఆర్డీఏ వెబ్సైట్లో ఉంచి ప్రజల అభిప్రాయ తీసుకున్నారు. అందులో రెండో ఆప్షన్కు దాదాపుగా 14 వేల ఓట్లు రావడంతో అదే నమూనా ఎంపికైంది.
Read Also: Uttar Pradesh: అన్నయ్య మరణం తట్టుకోలేక.. చెల్లి ఏం చేసిందంటే…
Also Read
- CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
- Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
- YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
- CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
అయితే, ఇప్పటికే ఈ నమూనాకు సంబంధించిన డీపీఆర్ సిద్ధమైంది. అమరావతిలోని ఎన్–19 రోడ్డును ఎన్హెచ్–65 (విజయవాడ–హైదరాబాద్ రహదారి)తో అనుసంధానం చేసేలా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. రూ.2,500 కోట్ల వ్యయం అయ్యే ఈ ప్రాజెక్టుకు త్వరలోనే టెండర్లను ఏపీ ప్రభుత్వం పిలవనుంది. కాగా, ఎరుపు, తెలుపు రంగుల్లో జంట పైలాన్లతో రూపుదిద్దుకునే ఈ ఐకాన్ వంతెన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు 5.22 కిలో మీటర్ల పొడవున కేబుల్ బ్రిడ్జ్ ను నిర్మించనున్నారు.
Read Also: TheyCallHimOG Bookings : ‘OG’ నైజాం బుకింగ్స్ ఓపెన్ చేసేందుకు డేట్ ఫిక్స్..
ఇక, ప్రస్తుతం ఎన్హెచ్–65 నుంచి అమరావతికి చేరుకోవాలంటే మూలపాడు, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, కనకదుర్గ వంతెన, ప్రకాశం బ్యారేజ్ మీదుగా 40 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది. ఈ ఐకానిక్ వంతెన పూర్తైతే మూలపాడు నుంచి కేవలం 5 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తే అమరావతిలోకి నేరుగా ప్రవేశం లభిస్తుంది. ఈ వంతెన నిర్మాణంతో సుమారు 35 కిలో మీటర్ల దూరం తగ్గి, గంటన్నర సమయం ఆదా కానుందని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Modi : ‘రాముడు, కృష్ణుడిని చూడలేదు.. వారి అంశ ఉన్న మోడీని చూశా’ .. తనికెళ్ల భరణి ఎమోషనల్!
-
Trisha: అదే డ్రెస్, ఆ మాటే హింట్!.. విజయ్’తో లవ్ రూమర్స్’పై త్రిష రియాక్షన్!
-
Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
-
Kriti Sanon: మేమూ సమానంగా కష్టపడుతున్నాం.. హీరోలపై కృతి సనన్ ఫైర్!
-
SRH vs GT: ప్లేఆఫ్స్ హీట్.. హై వోల్టేజ్ ఫైట్.. హైదరాబాద్, గుజరాత్కు కీలక సమరం!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?