Minister Roja: లంబసింగిలో రూ.35 కోట్లతో అల్లూరి మ్యూజియం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా శనివారం నాడు విశాఖ జిల్లాలో పర్యటించారు. ఈ రోజు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా విశాఖలోని ఆర్కే బీచ్లో అల్లూరి విగ్రహానికి పూలమలలు వేసి ఆమె నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అనంతరం మంత్రి రోజా మాట్లాడుతూ.. అల్లూరి కేవలం 27 ఏళ్లే జీవించినా 27 తరాలు గుర్తుంచుకునేలా జీవించారని వ్యాఖ్యానించారు. అల్లూరి పేరు చెప్తేనే చాలా మంది రోమాలు నిక్కబొడుచుకుంటాయని తెలిపారు. అల్లూరి మరణించి వందేళ్లు అయినా ఆయనకు మరణం లేదనే విషయాన్ని అందరూ భావిస్తున్నారని పేర్కొన్నారు. అల్లూరి స్మారకార్థం లంబసింగిలో రూ.35 కోట్లతో కేంద్రం సహకారంతో అల్లూరి మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి రోజా వెల్లడించారు.
అటు తొట్లకొండలో రాష్ట్ర ఆర్కియాలజీ శాఖ పరిరక్షిస్తున్న ప్రాచీన బౌద్ధ మహా స్థూపాన్ని మంత్రి రోజా సందర్శించారు. అనంతరం రోజా మాట్లాడారు. ఏపీ పురావస్తు శాఖ ఆధీనంలో ఈ ప్రాచీన బౌద్ధ నిర్మాణాలు పరిరక్షింపబడుతున్నాయని తెలిపారు. రెండు వేల ఏళ్ల నాటి బౌద్ధ నాగరిక ప్రపంచంలోకి తీసుకువెళ్లే ఓ అద్భుతమైన ప్రదేశం విశాఖ నగర శివార్లలో ఉండటం, మన రాష్ట్ర పర్యాటక ప్రదేశాలలో ప్రాచీన బౌద్ధ క్షేత్రం తొట్లకొండ ముఖ్యమైనదిగా చెప్పోకోవచ్చని అన్నారు. ఏపీలో బౌద్ధ మత వైభవానికి ఈ ప్రాంతం అద్దం పడుతుందన్నారు. మహా స్థూపం తరువాత ప్రముఖంగా బౌద్ధ భిక్షువుల నీటి అవసరాల కోసం అప్పట్లో ఇక్కడ 11 నీటి తొట్టెలను నిర్మించినట్లు చరిత్ర ఉందని.. ఇక్కడకు వచ్చిన టూరిస్టులు కొన్ని వేల ఏళ్లు వెనక్కి వెళ్లిన అనుభూతిని చెందుతారని చెప్పడంలో సందేహం లేదన్నారు. ఈ మేరకు పర్యాటకులకు మౌలిక వసతులు కల్పించాలని అధికారులను మంత్రి రోజా ఆదేశించారు.
Also Read
తాజావార్తలు
-
Ruturaj Gaikwad: ప్లేఆఫ్ రేస్ నుంచి చెన్నై ఔట్ అయ్యాక రుతురాజ్కు మరో షాక్!.. బీసీసీఐ భారీ జరిమానా
-
Jyotika: అందుకే తమిళ ఇండస్ట్రీకి వెళ్లా..చెన్నై నా జీవితాన్నే మార్చింది
-
Rooftop Water Tank Cooling Tips: ఎండ వేడితో ఇంటిపైన ఉన్న ట్యాంక్ నీరు మరుగుతోందా..? ఈ చిన్న చిట్కాలతో చల్లగా మారిపోతుంది..!
-
Maruti Suzuki: మారుతి సుజుకి కార్ల ధరలు రూ. 30,000 పెంపు..! జూన్ లోపు బుక్ చేసుకోండి..
-
Sharvari Wagh: షూటింగ్లో అలియాను చూసి ఎన్నో నేర్చుకున్నా: శార్వరీ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!