Srinivas Goud: మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ జ్యోతి, చైతన్య దీప్తి అల్లూరి సీతారామరాజు 98వ వర్థంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుడు, విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 98వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఉమ్మడి రాష్ట్రాల క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని అల్లూరికి ఘన నివాళులర్పించారు.
ఆనాటి స్వాతంత్ర సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినా పోరాటాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు జాతికి, తెలంగాణ ప్రాంతానికి చెందిన మహనీయుల సేవలను నేటి తరానికి అందించేందుకు వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా ప్రభుత్వం నిర్వహించి వారి సేవలను గుర్తుచేస్తున్నామన్నారు.
Also Read
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
27 ఏళ్ళ వయస్సులో గిరిజనులు, నిరక్షరాస్యులను, పేదలను, కొద్దిమంది అనుచరులతో, పరిమిత వనరులతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన గొప్ప ఉద్యమ శక్తి అల్లూరి సీతారామరాజు అని అభివర్ణించారు. అల్లూరి సీతారామరాజు ఈతరానికి కూడా స్ఫూర్తి అన్నారు. ఆయన త్యాగదీక్ష, ఏకాగ్రత, ధైర్యం నేటి యువత అలవర్చుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు చరిత్రను, వారి త్యాగనిరతిని భవిష్యత్ తరాలకు అందించేలా అందరూ కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామిక వేత్తలు రమేష్ దాట్ల, మంతెన వెంకట రామరాజు, DSN రాజు, అల్లూరి సీతారామరాజు, VVR వర్మ, క్షత్రీయ సేవ సమితి అధ్యక్షుడు పెరిచెర్ల నాగరాజు, నడింపల్లి నానిరాజు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాదాపూర్ సమీపంలోని ఖానామెట్ గ్రామ పరిధిలో 2 ఎకరాల 36 గుంటల భూమి పత్రాలను AP & TS Kshatriya Seva Samithi కి ప్రభుత్వం కేటాయించిన పత్రాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో జంటనగరాల్లో క్షత్రియ సోదరులు, సోదరీమణులు పాల్గొన్నారు.
Madhya Pradesh: వెంటపడి మరీ మహిళను చితకబాదిన లాయర్.. కారణమేంటంటే?
తాజావార్తలు
-
Peddi : ‘పెద్ది’ ట్రైలర్పై రిషబ్ శెట్టి ప్రశంసలు..!
-
CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!