Alluri Sitarama Raju: భీమవరంలో అల్లూరి విగ్రహం ప్రత్యేకతలు తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా భీమవరంలో ప్రధాని మోదీ వర్చువల్గా ఆవిష్కరించిన కాంస్య విగ్రహానికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ విగ్రహాన్ని రూ.3 కోట్ల వ్యయంతో 15 టన్నుల బరువుతో, 30 అడుగుల పొడవుతో నిర్మించారు. ఈ విగ్రహంలో 10 టన్నుల కాంస్యం, 7 టన్నుల స్టీలును వినియోగించారు. దేశంలోని అతిపెద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహంగా ఇది రికార్డులకెక్కింది. ఈ విగ్రహాన్ని బుర్రా ప్రసాద్ అనే శిల్పి 30 రోజుల్లో తయారు చేశారు.
Read Also: PM Modi : తెలుగువీర లేవరా.. దీక్షబూని సాగరా.. అంటూ
Also Read
పాలకొల్లు మండలం ఆగర్రు గ్రామానికి చెందిన అల్లూరి సీతారామరాజు అనే దాత సహకారంతో అల్లూరి విగ్రహాన్ని తయారు చేయించారు. అల్లూరి విగ్రహానికి అవసరమైన రూ.3 కోట్ల వ్యయాన్ని ఈ దాతే అందించారు. కాగా క్షత్రియుల జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో అయితే మన్యం వీరుడు అల్లూరి విగ్రహం ఉంటే బాగుంటుందని అందరూ భావించారు. దీంతో పాటు విప్లవకారుడు పుట్టిన ప్రాంతం కూడా ఇక్కడే ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవడంతో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి భీమవరం వేదికైంది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!