Deputy CM Alla Nani Revie Meeting on Jaggareddy Gudem Incident.
పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంటున్న మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టిస్తున్నారు. ఎవ్వరు ఎప్పుడూ ఎలా చనిపోతారో తెలియడం లేదని జంగారెడ్డిగూడెం గ్రామ ప్రజలు వాపోతున్నారు. రాత్రి పడుకున్న వారు తెల్లారేసరికి విగతజీవులుగా మారుతున్నారు. దీంతో ఇప్పటికే అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. మంత్రి పేర్ని నాని కూడా దీనిపై స్పందిస్తూ.. అధికారులు ఇప్పటికే మరణాలపై దర్యాప్తు చేస్తున్నారని, పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చాక అసలు విషయం తేలిపోతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో జంగారెడ్డి గూడెంలో జరిగిన మరణాల ఘటనపై ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మతో సమావేశమయ్యారు. మరికాసేపట్లో జంగారెడ్డిగూడెంకు ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, ఇతర అధికారులు చేరుకోనున్నారు. ప్రజలు భయాందోళన చెందవద్దని ఆయన అన్నారు.