Alapati raja: అన్నదాతల ఆగ్రహానికి జగన్ బలి కాక తప్పదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో జగన్ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా తీవ్ర విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఈ క్రాప్ నమోదు పేరుతో జగన్ సర్కారు రైతులను దారుణంగా దోచేస్తుందని ఆయన ఆరోపించారు. ఇది రైతులను దోచుకుంటున్న ప్రభుత్వం అని.. అన్నదాతల ఆగ్రహానికి సీఎం జగన్ బలికాక తప్పదని ఆలపాటి రాజా హెచ్చరించారు. భూమి, పంటల వివరాలు సక్రమంగా నమోదు చేయకుండా ధాన్యం కొనుగోళ్లలో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో 40 శాతం భూమికి సంబంధించిన సమాచారం ప్రభుత్వం దగ్గర లేదని స్పష్టం చేశారు.
Vishaka: చెత్త నుంచి 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : సైలెంట్ మోడ్ లో కాకినాడ జిల్లా వైసీపీ సీనియర్స్
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
క్వింటాల్ ధాన్యం కొనుగోలుకు సంబంధించి కూలీ ఛార్జీలు, గన్నీ బ్యాగ్, రవాణా ఛార్జీల పేరుతో రూ.400 వరకు రైతుల నుంచి అధికారులు వసూలు చేస్తున్నారని ఆలపాటి రాజా ఆరోపించారు. 6, 7 నెలలు గడిచినా ధాన్యం బకాయిలు చెల్లించడం లేదన్నారు. అధికార పార్టీ ఎంపీనే ధాన్యం రైతుల దోపిడీ వివరాలు బయట పెట్టారని.. ఇంతకంటే ప్రభుత్వానికి సిగ్గుచేటు ఉండదన్నారు. సీఎం చెబుతున్న రైతు భరోసా కేంద్రాలు పేరు గొప్ప, ఊరు దిబ్బగా మారాయని ఎద్దేవా చేశారు. సున్నా వడ్డీ రుణాలు రాష్ట్రంలో ఎందరు రైతులకు ఇచ్చారో సీఎం జగన్ చెప్పగలరా అని ప్రశ్నించారు. జగన్ ఏనాడైనా పంట సీజన్లకు ముందు జలవనరులు, వ్యవసాయ శాఖలతో సమీక్ష చేశారా అని ఆలపాటి రాజా నిలదీశారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!