Adivasi Divas: వైసీపీ కార్యాలయంలో ఘనంగా ఆదివాసీ దినోత్సవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, జంగా కృష్ణమూర్తి, లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు హనుమంత నాయక్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ.. గిరిజనుల సంస్కృతిని కాపాడుకోవడంలో పాటు విద్య వైద్యం అవసరం అన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే పాడేరులో వైద్య కళాశాల మంజూరు చేశారు.
విద్య విషయంలో నాడు నేడు కింద ఈ ప్రభుత్వం అభివృద్ది చేస్తోంది. గిరిజనుల్లో నాయకత్వాన్ని పెంచి గుర్తింపు ఇచ్చిన నాయకుడు వైఎస్ జగన్. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనలు, ఆశయాలు ఆదివాసీల కోసమే అన్నారు. వారికోసం ప్రత్యేకంగా జిల్లాలను కూడా ఏర్పాటు చేశారు. అధికారంలోకి రాకముందు కూడా గిరిజనుల కోసం పాటు పడిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. భూయాజమన్య హక్కులను మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గిరిజనులకు అందించారు.
Also Read
- PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
- CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
- Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
- Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
ఈ ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల ప్రభుత్వం. ప్రతి సంక్షేమ ఫలాలను గిరిజనులకు అందిస్తున్నారు. పోడు భూముల హక్కులను కల్పిస్తూ అండగా నిలిచారు. వైఎస్సార్సీపీ గిరిజన విభాగం అధ్యక్షుడు హనుమంతు నాయక్ గిరిజనుల కోసం జగన్ చేస్తున్న కృషిని ప్రస్తావించారు. గిరిజన హక్కులను కాపాడే దిశగా ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం అన్నారు. చంద్రబాబు గిరిజనుల హక్కులను అణచివేసిన విషయం అందరూ గుర్తుంచుకోవాలి. ఎస్టీ కమిషన్, గిరిజన సలహా మండలి ఏర్పాటు వైఎస్ జగన్ చేశారు. గిరిజనులను డిప్యూటీ సీఎం గా చేశారు. అర్వో ఎఫ్ ఆర్ పట్టాలు ఇచ్చి గిరిజనులకు మేలుచేసిన వ్యక్తి వైఎస్ జగన్ అన్నారు.
Bihar Politics: బీజేపీతో జేడీయూ తెగదెంపులు.. గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన సీఎం నితీష్ కుమార్
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?