ఏపీకి ఏకైక రాజధాని అమరావతే: నటుడు శివాజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు నటుడు శివాజీ సంఘీభావం తెలిపారు. అమరావతి రైతులను కలిసి వారికి తన మద్దతును తెలియజేశారు. ఏపీ అంటేనే కులాల కుంపటి అని… ఈ కులాల కుంపట్ల మధ్య రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని శివాజీ ప్రశ్నించారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ఎవరూ గుర్తించడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజలు సినిమాలో సీన్లను బాగానే గుర్తుపెట్టుకుంటారని.. కానీ సమాజంలో జరుగుతున్న వాటిని మాత్రం గుర్తుపెట్టుకోవడం లేదన్నారు. ప్రజలందరూ కలుషితం అయిపోయారని.. ఆ కలుషితం నుంచి బయటపడినప్పుడే భవిష్యత్ తరాలకు మంచి జీవితాన్ని ఇవ్వగలుగుతామని హితవు పలికారు.
Read Also: అల్లుడి ప్రేమలో పడిన అత్త.. కూతురు పెళ్లిలోనే అలా చేసి…
Also Read
- CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
దేశంలో రాజకీయ వ్యవస్థ బాగా భ్రష్టు పట్టిపోయిందని.. అందుకే అంబానీ లాంటి వారే దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని భావిస్తున్నారని శివాజీ వ్యాఖ్యానించారు. అమరావతిని ఏదో చేద్దామనుకుంటే అది భ్రమేనని.. అమరావతిని ఏం చేయలేరని శివాజీ స్పష్టం చేశారు. ఏపీకి ఉన్న ఏకైక రాజధాని అమరావతే అని.. ఎన్నికల్లో ఎంత డబ్బు పంచినా ఓటర్లు తమ ఆత్మసాక్షికే ఓటు వేస్తారని శివాజీ చెప్పారు. కొడాలి నాని, బొత్స సత్యనారాయణ లాంటి వారు ఎన్ని మాటలు మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని… రాజకీయ నాయకులు ఎప్పటికీ శాశ్వతం కాదనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. మన దౌర్భాగ్యం ఏంటంటే… మీడియా కూడా వర్గాలుగా విడిపోయింది అంటూ శివాజీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!