Loan App Crime: లోన్ యాప్ వేధింపులకు వ్యక్తి మృతి.. విచారణలో షాకింగ్ నిజాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Man Manikanta Commits Suicide Due To Loan App Harassment In Vijayawada: పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. లోన్ యాప్ వేధింపులు ఆగడం లేదు. బాధితులను నిర్వాహకులు రకరకాలుగా టార్చర్ పెడుతూనే ఉన్నారు. బూతులు తిట్టడమే కాకుండా, న్యూడ్ ఫోటోలు వైరల్ చేస్తూ వేధిస్తున్నారు. ఈ వేధింపులు తాళలేకే రీసెంట్గా మణికంఠ (33) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడలో పాల వ్యాన్ డ్రైవర్గా పని చేస్తున్న ఇతను, ఆర్థిక అవసరాల నిమిత్తం లోన్ యాప్స్ నుంచి రుణాలు తీసుకున్నాడు. అయితే.. రుణం సరిగ్గా కట్టకపోవడంతో అతడ్ని వేధించడం మొదలుపెట్టారు. దీంతో, మనస్తాపానికి గురైన మణికంఠ, ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.
మణికంఠ భార్య ఫిర్యాదు మేరకు సెక్షన్ 306 ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా కొన్ని షాకింగ్ నిజాలు బయటకొచ్చాయి. మణికంఠ సుమారు 30 యాప్స్ నుంచి రుణాలు తీసుకున్నట్టు గుర్తించారు. లోన్ యాప్స్ నిర్వాహకులు అతనికి న్యూడ్ ఫోటోలను సైతం పంపించారు. ఆ ఫోటోలను సోసల్ మీడియాలో పెడతామని లోన్ యాప్స్ నిర్వాహకులు వాట్సాప్లో మెసేజ్లు పంపారు. ఆ చాటింగ్ సేకరించిన పోలీసులు.. మణికంఠ ఫోన్ సీజ్ చేశారు. నిందితుల్ని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు.. లోన్యాప్ల నిర్వాహకులు వేధింపులకు పాల్పడితే భయాందోళన చెందకుండా బాధితులు ధైర్యంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయాలని, ఆగడాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సూచిస్తున్నారు. లోన్యాప్ ఆగడాలపై ఫిర్యాదుకు 1930 ఫోన్ నంబర్తో ఏర్పాటు చేసిన కాల్సెంటర్ను వినియోగించుకోవాలని కోరారు.
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
కాగా.. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకూ లోన్యాప్ ఆగడాలను భరించలేక ఆరుగురు బలవన్మరణం చెందారు. లోన్యాప్ ఆగడాలపై రాష్ట్రంలో ఇప్పటిదాకా 75 కేసులు నమోదు కాగా.. 71 మందిని అరెస్ట్ చేశారు. 207 ఫేక్లోన్ యాప్లను గుర్తించి, వాటిలో 173 యాప్లను అధికారులు నిషేధించారు. ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుండి ఈ యాప్లు ఆపరేట్ అవుతున్నాయని పేర్కొన్నారు. లోన్యాప్ ఆగడాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తాజావార్తలు
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Oscars Academy :’RRR’ ఎడిటర్కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్కు రంగం సిద్ధం
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!