Gold Fraud: ఘరానా మోసం.. తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్పి టోకరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Gang Cheated A Man In The Name Of Gold In Kurnool District: బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి..? అందునా.. తక్కువ ధరకే ఇస్తామంటే, జనాలు ఇంకా ఎగబడతారు. ఇప్పుడున్న డిమాండింగ్ రోజుల్లో తక్కువ మొత్తానికే బంగారం సొంతం చేసుకుంటే, లాభం పొందవచ్చన్న ఉద్దేశంతో ముందుకొస్తారు. ఈ బలహీనతనే పసిగట్టి.. ఓ ముఠా ఘరానా మోసానికి పాల్పడింది. తక్కువ మొత్తానికే బంగారం ఇస్తామని ఊరించి.. ఒక వ్యక్తికి కుచ్చటోపీ పెట్టారు. అతని వద్ద నుంచి భారీ సొమ్ము తీసుకొని, నకిలీ బంగారమిచ్చి ఉడాయించారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
India vs Pakistan: వన్డే ప్రపంచకప్ 2023.. భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ రీ-షెడ్యూల్! కారణం ఏంటంటే?
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
కర్నూలు జిల్లా గడివేముల మండలంలోని బూజనూరు ఓ ముఠా తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మబలికింది. తాము ఎక్సవేటర్ పనులు చేస్తుంటే, భారీ మొత్తంలో బంగారం దొరికిందని మాయగాళ్లు మాయమాటలు చెప్పారు. అంతేకాదు.. జనాలను నమ్మించడం కోసం కొంత ఒరిజినల్ బంగారాన్ని చూపించారు. అది చూసి నిజమేననుకున్న నరసింహులు అనే వ్యక్తి.. వారితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. తన వద్ద రూ.7 లక్షలు ఉన్నాయని, ఆ మొత్తంలో తనకు ఎక్కువ బంగారం ఇవ్వాలని కోరాడు. ఇంకేముంది.. తాము వేసిన వలలో చేప చిక్కుకుందని భావించి, ఆ కేటుగాళ్లు సరేనని తలూపారు. దాంతో.. తాను జాక్పాట్ కొట్టేశానని నరసింహులు భావించాడు.
Boyfriend Crime: దారుణం.. ప్రేమించిన యువతిని దూరం చేస్తున్నారని..
ఒప్పందం ప్రకారం.. నరసింహులు ఆ కేటుగాళ్లకు రూ.7 లక్షలు ఇవ్వగా, వాళ్లు నకిలీ బంగారం ఇచ్చారు. అది నిజమైన బంగారమేనని భావించి, దాన్ని తీసుకొని ఇంటికెళ్లాడు. తీరా చూస్తే.. అది నకిలీ బంగారమని తేలింది. దీంతో వాళ్లు నిలదీయడానికి నరసింహులు వెళ్లగా.. అప్పటికే ఆ కేటుగాళ్లు రూ.7 లక్షలు తీసుకొని ఉడాయించారు. ఫోన్ చేసినా స్విచ్చాఫ్ వస్తుండటంతో.. తాను మోసపోయానని భావించి, మరో దారి లేక పోలీసుల్ని ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!