30 years PrudhviRaj: జనసేనలోకి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి… నాగబాబుతో భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పిన సినీ నటుడు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్విరాజ్ త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నారు.. ఇవాళ మెగా బ్రదర్ నాగబాబును కలిసిన ఆయన.. జనసేన పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాతుర్మాస దీక్ష ముగియగానే.. ఉభయగోదావరి జిల్లాల పర్యటనలో జనసేన కండువవా కప్పుకుంటారని తెలుస్తోంది.. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగేలా ప్లాన్ చేసుకుంటున్నారట పృథ్వి.. తన స్వస్థలం తాడేపల్లిగూడెం నుంచే ఎన్నికల బరిలో దిగుతారనే చర్చ సాగుతోంది..
Read Also: Basavaraj Bommai: కర్ణాటక ముఖ్యమంత్రికి కొవిడ్ పాజిటివ్.. ఢిల్లీ పర్యటన రద్దు
Also Read
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
కాగా, 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచుకున్నారు కమెడియన్ పృథ్వి రాజ్.. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. కమెడియన్గా ఓ వెలుగు వెలిగిన తర్వతా రాజకీయాల్లో ప్రవేశించి తన లక్ను పరీక్షించుకున్నాడు. అంతేకాదు గత ఎన్నికల్లో వైసీపీ తరుపున జోరుగా ప్రచారం నిర్వహించాడు.. దీంతో, ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్.. పృథ్వీకి ప్రతిష్ఠాత్మకమైన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్కు ఏకంగా చైర్మన్ చేసేసాడు. ఆ తర్వాత ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంలో ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక, ఎస్వీబీసీ వ్యవహారంలో ఎవరో గిట్టని వాళ్లు తనను అన్యాయంగా ఇరికించారని వాపోయాడు. తనను ఇరికించిన వారిని ఆ వేంకటేశ్వర స్వామి దండిస్తారని కూడా వ్యాఖ్యానించారు. అంతేకాదు, రాజకీయాల కారణంగా తాను సినిమా రంగంలో అవకాశాలు తగ్గాయని వాపోయిన పృథ్విరాజ్.. ఒకప్పటిలా తనకు ఎవరు పిలిచి మరి ఆఫర్స్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. రాజకీయాల్లో నా లాంటి ముక్కుసూటి మనిషికి పడవనే విషయం అర్ధమైంది.
తనకు ఎస్వీబీసీ చైర్మన్ పదవి వస్తే.. అంతా ఆ శ్రీవారి కృప అనుకున్నాను. కానీ, నాకు తెలియకుండానే నా వెనకాల గోతులు తీస్తారని ఊహించలేదున్నారు పృథ్వి. జరిగిన పరిణామాలు నాకో గొప్ప గుణపాఠం నేర్పాయి. ఈ రాజకీయాలు కారణంగా అందరూ బాగానే ఉన్నా.. నేను మాత్రం రోడ్డున పడ్డానన్నారు. నాకు అసలు రాజకీయాలే పడవు. వెనకాల కొండను చూసుకొని అంటూ సీఎం వైఎస్ జగన్ అండ చూసుకొని రెచ్చిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పట్లో ఇండస్ట్రీ పెద్దల గురించి కొన్ని తప్పుడు వ్యాఖ్యలు చేశాను. దీంతో ఫుట్బాల్ లా ఎక్కడో పోయిపడ్డాను.. త్వరలోనే అందరినీ కలుస్తానంటూ.. గతంలో ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. మరీ ఇప్పుడు జనసేనలో చేరిన తర్వాత.. మొత్తంగా రాజకీయాలపైనే ఫోకస్ పెడతారా? అటు సినిమాలు.. రాజకీయాలు రెండూ బ్యాలెన్స్ చేస్తారా చూడాలి మరి.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!