30 years PrudhviRaj: జనసేనలోకి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి… నాగబాబుతో భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పిన సినీ నటుడు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్విరాజ్ త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నారు.. ఇవాళ మెగా బ్రదర్ నాగబాబును కలిసిన ఆయన.. జనసేన పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాతుర్మాస దీక్ష ముగియగానే.. ఉభయగోదావరి జిల్లాల పర్యటనలో జనసేన కండువవా కప్పుకుంటారని తెలుస్తోంది.. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగేలా ప్లాన్ చేసుకుంటున్నారట పృథ్వి.. తన స్వస్థలం తాడేపల్లిగూడెం నుంచే ఎన్నికల బరిలో దిగుతారనే చర్చ సాగుతోంది..
Read Also: Basavaraj Bommai: కర్ణాటక ముఖ్యమంత్రికి కొవిడ్ పాజిటివ్.. ఢిల్లీ పర్యటన రద్దు
Also Read
- Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
- Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
- YS Jagan: ముద్రగడకు జగన్ భావోద్వేగ నివాళి.. 'పితృసమాన నేతను కోల్పోయాం'
- Pawan Kalyan: రేపు హైదరాబాద్కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
కాగా, 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచుకున్నారు కమెడియన్ పృథ్వి రాజ్.. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. కమెడియన్గా ఓ వెలుగు వెలిగిన తర్వతా రాజకీయాల్లో ప్రవేశించి తన లక్ను పరీక్షించుకున్నాడు. అంతేకాదు గత ఎన్నికల్లో వైసీపీ తరుపున జోరుగా ప్రచారం నిర్వహించాడు.. దీంతో, ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్.. పృథ్వీకి ప్రతిష్ఠాత్మకమైన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్కు ఏకంగా చైర్మన్ చేసేసాడు. ఆ తర్వాత ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంలో ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక, ఎస్వీబీసీ వ్యవహారంలో ఎవరో గిట్టని వాళ్లు తనను అన్యాయంగా ఇరికించారని వాపోయాడు. తనను ఇరికించిన వారిని ఆ వేంకటేశ్వర స్వామి దండిస్తారని కూడా వ్యాఖ్యానించారు. అంతేకాదు, రాజకీయాల కారణంగా తాను సినిమా రంగంలో అవకాశాలు తగ్గాయని వాపోయిన పృథ్విరాజ్.. ఒకప్పటిలా తనకు ఎవరు పిలిచి మరి ఆఫర్స్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. రాజకీయాల్లో నా లాంటి ముక్కుసూటి మనిషికి పడవనే విషయం అర్ధమైంది.
తనకు ఎస్వీబీసీ చైర్మన్ పదవి వస్తే.. అంతా ఆ శ్రీవారి కృప అనుకున్నాను. కానీ, నాకు తెలియకుండానే నా వెనకాల గోతులు తీస్తారని ఊహించలేదున్నారు పృథ్వి. జరిగిన పరిణామాలు నాకో గొప్ప గుణపాఠం నేర్పాయి. ఈ రాజకీయాలు కారణంగా అందరూ బాగానే ఉన్నా.. నేను మాత్రం రోడ్డున పడ్డానన్నారు. నాకు అసలు రాజకీయాలే పడవు. వెనకాల కొండను చూసుకొని అంటూ సీఎం వైఎస్ జగన్ అండ చూసుకొని రెచ్చిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పట్లో ఇండస్ట్రీ పెద్దల గురించి కొన్ని తప్పుడు వ్యాఖ్యలు చేశాను. దీంతో ఫుట్బాల్ లా ఎక్కడో పోయిపడ్డాను.. త్వరలోనే అందరినీ కలుస్తానంటూ.. గతంలో ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. మరీ ఇప్పుడు జనసేనలో చేరిన తర్వాత.. మొత్తంగా రాజకీయాలపైనే ఫోకస్ పెడతారా? అటు సినిమాలు.. రాజకీయాలు రెండూ బ్యాలెన్స్ చేస్తారా చూడాలి మరి.
తాజావార్తలు
-
Akshay Kumar: నవ్వులు కాదు.. ఈసారి భయపెట్టేందుకు వస్తున్న అక్షయ్ కుమార్… ఈరోజే ‘హైవానియత్’ టీజర్
-
SPIRIT : స్పిరిట్ కర్నాటక థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన టాలీవుడ్ నిర్మాత
-
RC 17 : దసరాకి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభం!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
ట్రెండింగ్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!