కృష్ణా జిల్లా: ఏపీకిమరో 3.72 లక్షల కరోనా టీకా డోసులు తరలివచ్చాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి..ఢిల్లీ నుంచి చేరుకున్న ఎయిర్ ఇండియా విమానంలో 32 బాక్సుల్లో రాష్ట్రానికి తరలివచ్చాయి టీకా డోసులు.. తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్ ను తరలించారు అధికారులు.
read also : తెలకపల్లి రవి : వరస ఎన్నికలకు బిజెపి ఆరెస్సెస్ రెడీ, మోడీ ఇమేజి కోసం మొహాల మార్పు
అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు వ్యాక్సిన్లు తరలివెళ్లనున్నాయి. కాగా… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులినెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 66,657 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1578 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, 22 మంది మృతిచెందారు..