Vijayawada: మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగి చిన్నారి మృతి
- విజయవాడలోని అశోక్నగర్లో విషాదం
- మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగి ఏడాదిన్నర చిన్నారి మృతి
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలోని అశోక్నగర్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగి ఏడాదిన్నర చిన్నారి మృతిచెందింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. శనివారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడ పడమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Bhumana Karunakar Reddy: తప్పు చేస్తే నేను, నా కుటుంబం సర్వనాశనం అవుతుంది..
Also Read
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
- Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
కృష్ణాజిల్లా మచిలీపట్నం టెంపుల్ కాలనీకి చెందిన మహమ్మద్ అబ్బాస్.. క్రేన్ హెల్పర్గా పని చేస్తున్నాడు. విజయవాడ అశోక్నగర్కు చెందిన మహిళతో నాలుగేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి అయేషా, ఆఫియా అనే (18 నెలల) చిన్నారులు ఉన్నారు. ఈనెల 19న అబ్బాస్.. తన భార్య, ఇద్దరు పిల్లలతో మచిలీపట్నం నుంచి విజయవాడ అశోక్నగర్లోని అత్తారింటికి వచ్చారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆఫియా ఆడుకుంటూ స్నానాల గదిలోకి వెళ్లింది. అక్కడ బాత్రూం శుభ్రం చేసే యాసిడ్ బాటిల్ కనిపించింది. సీసా మూత తీసి మంచినీళ్లు అనుకుని తాగేసింది. అనంతరం చిన్నారికి వాంతులు అవ్వడం ప్రారంభమయ్యాయి. తండ్రి అబ్బాస్ వెంటనే గమనించి ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. వైద్యులు వెంటనే వైద్యం ప్రారంభించినా ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ శనివారం రాత్రి చనిపోయింది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: Nitin Gadkari: నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న గ్యారెంటీ లేదు..!
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!