Vijayawada: మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగి చిన్నారి మృతి
- విజయవాడలోని అశోక్నగర్లో విషాదం
- మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగి ఏడాదిన్నర చిన్నారి మృతి
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలోని అశోక్నగర్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగి ఏడాదిన్నర చిన్నారి మృతిచెందింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. శనివారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడ పడమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Bhumana Karunakar Reddy: తప్పు చేస్తే నేను, నా కుటుంబం సర్వనాశనం అవుతుంది..
Also Read
కృష్ణాజిల్లా మచిలీపట్నం టెంపుల్ కాలనీకి చెందిన మహమ్మద్ అబ్బాస్.. క్రేన్ హెల్పర్గా పని చేస్తున్నాడు. విజయవాడ అశోక్నగర్కు చెందిన మహిళతో నాలుగేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి అయేషా, ఆఫియా అనే (18 నెలల) చిన్నారులు ఉన్నారు. ఈనెల 19న అబ్బాస్.. తన భార్య, ఇద్దరు పిల్లలతో మచిలీపట్నం నుంచి విజయవాడ అశోక్నగర్లోని అత్తారింటికి వచ్చారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆఫియా ఆడుకుంటూ స్నానాల గదిలోకి వెళ్లింది. అక్కడ బాత్రూం శుభ్రం చేసే యాసిడ్ బాటిల్ కనిపించింది. సీసా మూత తీసి మంచినీళ్లు అనుకుని తాగేసింది. అనంతరం చిన్నారికి వాంతులు అవ్వడం ప్రారంభమయ్యాయి. తండ్రి అబ్బాస్ వెంటనే గమనించి ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. వైద్యులు వెంటనే వైద్యం ప్రారంభించినా ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ శనివారం రాత్రి చనిపోయింది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: Nitin Gadkari: నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న గ్యారెంటీ లేదు..!
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..