Nitin Gadkari: నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న గ్యారెంటీ లేదు..!
- కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర కామెంట్స్
- కేంద్రమంత్రి రామ్దాస్ అథవాలేను ఉద్దేశించి సరదాగా కామెంట్స్
- ఎన్డీయే నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న గ్యారెంటీ లేదు..
- రాందాస్ అథవాలే మంత్రి కావడం ఖాయం- నితిన్ గడ్కరీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమానికి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. తనతో పాటు కార్యక్రమంలో మరో కేంద్రమంత్రి రామ్దాస్ అథవాలే పాల్గొన్నారు. ఈ క్రమంలో తనను ఉద్దేశించి సరదాగా కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎన్డీయే నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న గ్యారెంటీ లేదని.. కానీ రాందాస్ అథవాలే మంత్రి కావడం ఖాయమని గడ్కరీ అన్నారు. అయితే.. ఇదంతా తాను సరదాగానే చెప్తున్నాననీ.. సీరియస్గా మాత్రం తీసుకోవద్దని అన్నారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన ప్రముఖ, శక్తిమంతమైన నాయకుడు రాందాస్ ఇప్పటి వరకు మూడు ఎన్డీయే ప్రభుత్వాల హయాంలో మంత్రి పదవిని నిర్వహించడం గమనార్హం.
Read Also: Bee Attack: తేనెటీగల దాడిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..
Also Read
- Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
- Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
- Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
- Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో 'లగ్జరీ' ఫోన్.. రేపు అందుబాటులోకి..
అంతకుముందు రాందాస్ అథవాలే మాట్లాడుతూ.. వచ్చేసారి కూడా మంత్రి పదవికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కాగా.. రామ్ విలాస్ పాశ్వాన్ విషయంలో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఇలాగే మాట్లాడేవారని గడ్కరీ గుర్తు చేశారు. “రాందాస్ అథవాలేకు నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అతనికి మంచి జీవితం, ఆరోగ్యకరమైన జీవితం ఉండాలని కోరుకుంటున్నాను. దళితులు, అణగారిన ప్రజల అభ్యున్నతి కోసం ఆయన కృషి చేశారు” అని అన్నారు.
Read Also: Snake bite: పాముకాటుతో యువకుడు మృతి.. అతని చితిపై పామును సజీవ దహనం
అథవాలే RPI(A) పార్టీ మహారాష్ట్రలో మహా కూటమి ప్రభుత్వంలో భాగం. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి 10 నుంచి 12 స్థానాల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని అథవాలే తెలిపారు. “ఆర్పిఐ (ఎ) పార్టీ గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేస్తుంది. విదర్భలో నార్త్ నాగ్పూర్, ఉమ్రెడ్ (నాగ్పూర్), ఉమర్కర్, వసీమ్లతో సహా 3-4 స్థానాలను పార్టీ కోరనుంది” అని తెలిపారు. ఈ కూటమిలో బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలు ఉండటం గమనార్హం.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!