ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. ఇవాళ 31,855 శాంపిల్స్ పరీక్షించగా.. 137 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఒక్కరు కోవిడ్ బాధితులు మృతి చెందారు..
ఇదే సమయంలో 189 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,09,60,653 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2075683 కు పెరిగింది.. ఇక, రికవరీ కేసులు 2059500 కు చేరుకోగా.. ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 14478 కు చేరిందని.. ప్రస్తుతం 1705 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.