రెంటికి చెడ్డ రేవడిలా మారిన కాంగ్రెస్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్ అధికారంలో ఉంది. దీంతో ఈ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేజారిపోకుండా కాంగ్రెస్ అధిష్టానం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. అయితే ఆపార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు కాంగ్రెస్ కు అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా మారుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో అధిష్టానం ఒకటి తలిస్తే మరొకటి జరుగుతుండటంతో నేతలంతా తలలు పట్టుకుంటున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ అధిష్టానం పంజాబ్ లో నాయకత్వ మార్పునకు శ్రీకారం చుట్టింది. ప్రతిపక్ష పార్టీలు ఎస్సీ ఓటు బ్యాంకుపై కన్నేయడంతో ముందుగానే కాంగ్రెస్ అలర్ట్ అయింది. ఈమేరకు అధిష్టానం ఏకంగా ముఖ్యమంత్రినే తప్పించింది. అమరీందర్ సింగ్ స్థానంలో ఎస్సీ వర్గానికి చెందిన చరణ్ జిత్ సింగ్ ను ముఖ్యమంత్రిగా నియమించింది. ఇదంతా పైకి బాగానే ఉన్నట్లు కన్పించినా లోలోపల మాత్రం లుకలుకలు బయట పడుతున్నాయి.
Also Read
- Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. 'వ్యూహ లక్ష్మి అచ్చు' గురించి తెలుసా.?
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా సిద్ధూను నియమించినప్పుడే ఆ పార్టీలో విబేధాలు ముదురుతాయని కాంగ్రెస్ భావించింది. అనుకున్నట్లుగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెండుగా చీలిపోయారు. పీసీసీ వైపు కొందరుంటే.. ముఖ్యమంత్రి వైపు కొందరు నిలిచారు. ప్రతిపక్షాలకు చెక్ వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ పాత సీఎంను తప్పించి కొత్త సీఎంగా చరణ్ జిత్ సింగ్ ను ప్రకటించింది. కానీ అమరీందర్ సింగ్ ను తప్పించిన విధానమే విమర్శలకు తావిస్తోంది. దీంతో ఆయన వర్గం నేతలు అదును కోసం చూస్తున్నారు.
మరోవైపు సిద్ధూ తన పీసీసీ పదవీకి తాజాగా రాజీనామా చేయడం ఆపార్టీలో కలకలం రేపుతోంది. తనకు ఇష్టం లేకుండా డిప్యూటీ సీఎంగా సుఖజిందర్ సింగ్ రాధాను నియమించడంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ లో ఆయన తన పదవీకి అడ్డువస్తారనే కారణంతో ముందుగానే సిద్ధూ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. సిద్దూకు మద్దతుగా ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు. మంత్రి వర్గ విస్తరణ చేపట్టిన కొద్దిగంటల్లో ఆపార్టీలో అసమ్మతి అంటుకోవడంతో అధిష్టానం డైలామాలో పడింది.
పాత సీఎంను తప్పించడమే కాకుండా పీసీసీ అధ్యక్షుడికి సైతం వ్యతిరేకంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాలు తీసుకుంది. దీంతో ఇరువర్గాల నేతలు అధిష్టానంపై రగిలిపోతున్నారు. ఇరువర్గాలను కూర్చోబెట్టి సామరస్యంగా సమస్యను పరిష్కరించాల్సిన అధిష్టానం కొత్త సమస్యలను సృష్టిస్తోందన్న వాదన వినిపిస్తోంది. దీంతో ఆపార్టీ నేతలు పక్కచూపులు చూడాల్సి వస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పంజాబ్ లో ఏరికోరి కష్టాలను కొని తెచ్చుకుంటోందన్న చర్చ సాగుతోంది.
అధిష్టానం నిర్ణయాలే ఆపార్టీకి శాపంగా మారుతున్నాయనే టాక్ విన్పిస్తోంది. ఇరువర్గాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకొని ఏం సాధించిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే ఆపార్టీ నిండా మునగడం ఖాయమంటున్నారు. బీజేపీ సైతం కాంగ్రెస్ లో నెలకొన్న సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుంది. దీంతో పంజాబ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..