హుజురాబాద్ లో ప్రలోభాలు షూరు.. ఆ మార్గంపై ఈసీ స్పెషల్ ఫోకస్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఈ ఎన్నికను బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోరు రసవత్తరంగా మారింది. కురుక్షేత్రాన్ని తలపించేలా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. అయితే కాంగ్రెస్ ఈ రేసులో బాగా వెనుకబడినట్లు కన్పిస్తోంది. దీంతో త్రిముఖ పోటీ కాస్తా ద్విముఖ పోటీగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కాంగ్రెస్ ఏ క్షణానైనా పుంజుకునే అవకాశం ఉందని ఆపార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈనెల తొలివారం నుంచి హుజూరాబాద్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ లు నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే ఈ రెండు పార్టీలు ప్రచారంలో దూసుకెళుతున్నాయి. ఇక కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ పేరు ఖరారైంది. మరోవైపు పోలింగ్ తేది సమీపిస్తుండటంతో హుజూరాబాద్లో ప్రలోభాలపర్వం మొదలైంది.
Also Read
- Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. 'వ్యూహ లక్ష్మి అచ్చు' గురించి తెలుసా.?
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
తెలంగాణలో అత్యంత కాస్లీ ఎన్నికగా హుజూరాబాద్ ఉప ఎన్నిక నిలువనుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈసీ హుజూరాబాద్ ఉప ఎన్నికపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రోడ్డు మార్గంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఇటీవల ఓ కారులో 15లక్షల నగదు పట్టుబడింది. అయితే హుజూరాబాద్ కు రైలు మార్గంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేరుతున్నట్లు ఈసీ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సికింద్రాబాద్ టూ జమ్మికుంట రైల్వే మార్గంలో తనిఖీలు చేపట్టాలని ఈసీ భావిస్తోంది.
వాస్తవానికి రైల్వేలో సామాగ్రిని, డబ్బులను తరలించడం చాలా సులువు. రైల్వే స్టేషన్లలో టిక్కెట్లను తనిఖీ చేసే అధికారులు ప్రయాణీకుల బ్యాగుల్లో ఏం ఉందనే వాటిని పెద్దగా పట్టించుకోరు. దీనిని రాజకీయ నాయకులు ఆసరాగా తీసుకొని రైల్వే మార్గంలో హుజూరాబాద్ కు డబ్బులను చేరవేస్తున్నారని టాక్ విన్పిస్తుంది. ఇటీవలీ కాలంలో జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్లలో నాయకుల అందుకే ఎక్కువైందట. ప్రలోభాలకు రైల్వే మార్గం రాచమార్గంగా మారిందని ఈసీ భావిస్తోంది.
ఈమేరకు ఈసీ రైల్వే అధికారులకు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ టూ జమ్మికుంట వరకు రైల్వే పోలీసులు ప్రత్యేకంగా తనిఖీ చేయాలని ఈసీ రిపోర్ట్ ఇచ్చినట్లు అధికారులు సైతం వెల్లడిస్తున్నారు. మొత్తానికి హుజూరాబాద్ పై ఈసీ ప్రత్యేక నజర్ వేసినట్లే కన్పిస్తుంది. రోడ్డు, రైల్వే మార్గాలపై ఈసీ ఫోకస్ పెట్టడంతో నేతలు సైతం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఉప ఎన్నిక సందర్భంగా ఈసీ ఎంత డబ్బును స్వాధీనం చేసుకుంటుందనే చర్చ సైతం ప్రజల్లో జోరుగా సాగుతోంది.
తాజావార్తలు
-
PM Modi: ఎర్రకోట వేదికగా యూత్కు ప్రధాని మోడీ గుడ్న్యూస్.. కోటి మంది యువతకు ఉచితంగా..
-
Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
-
PM Modi: ప్రభుత్వ అధికార వర్గాల్లోనూ మావోయిస్టు భావజాలం.. ‘అర్బన్ నక్సల్స్’ను సమాజం దూరం పెట్టాలి..
-
Trisha Krishnan: సీఎం విజయ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో త్రిష.. ఫ్రంట్ రోలో కూర్చుని సెల్యూట్
-
IND vs SL: మరోమారు సర్ఫరాజ్ ఖాన్కు మొండిచేయి.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..!
ట్రెండింగ్
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!