Viral News : మెట్రోలో తిన్న ప్రయాణికుడు.. షాక్ ఇచ్చిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెట్రో ప్రయాణం చాలా సులువైన ప్రయాణం.. ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా త్వరగా గమ్యానికి చేరావేస్తుంది.. అందుకే ఎక్కువ మంది మెట్రోను ఎక్కడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇటీవల మెట్రోలో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువయ్యాయి.. సోషల్ మీడియాలో క్రేజ్ ను పెంచుకొవడం కోసం మెట్రోలో డ్యాన్స్ లు చెయ్యడంతో పాటు, రొమాన్స్ చేసుకునేందుకు లవర్స్ కు అడ్డాగా మారింది.. దానిపై ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉన్నాయి..
తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది.. ఓ వ్యక్తి మెట్రోలో కూర్చొని దర్జాగా మంచూరియా తిన్నాడు.. అందులో పెద్ద వింతేముంది అనుకుంటున్నారా? అక్కడే మీరు పప్పులో కాలేసినట్లు.. మెట్రోలో పరిశుభ్రతకు భంగం కలుగకుండా తిను బండారాలను రైళ్లో తినడానికి వీలు లేదని అధికారులు ఎప్పుడో ప్రకటించారు.. కానీ అది లెక్క చెయ్యకుండా ఓ వ్యక్తి మంచూరియ తినడం విచిత్రం..ఈ ఘటన బెంగుళూరు మెట్రోలో జరిగింది.. గోబీ మంచూరియా తింటూ వీడియోకు పోజులిచ్చాడు… ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది..
Also Read
- Conch Shell Facts: శంఖం రహస్యం తెలుసా? పూజలో ఉపయోగించే ఈ వస్తువు వెనుక ఆశ్చర్యకరమైన నిజాలు
- 540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!
ఇదికాస్తా అటు తిరిగి ఇటు తిరిగి మెట్రో యాజమాన్యం దృష్టికెళ్లింది. దీంతో సదరు ప్రయాణీకుడికి మెట్రో యాజమాన్యం షాకిచ్చింది. రూ.500 జరిమానా విధించింది. అంతేకాదు కేసు కూడా నమోదు చేసింది. బెంగుళూరు మెట్రో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. దీంట్లో నగర మెట్రో నిబంధనల ప్రకారం రైళ్లలో ఆహారం తినటం, ప్లాట్ఫారమ్లపై భోజనం చేయడం నిషేధం. ఈ నిబంధనలు అతిక్రమించటంలో యాజమాన్యం పోలీసులకు సదరు ప్రయాణీకుడిపై ఫిర్యాదు చేసింది. రూ.500లు జరిమానా విధించింది.. తన స్నేహితులతో కలిసి మెట్రోలో ఆఫీస్ కు బయల్దేరాడు. ఈక్రమంలో మెట్రోలో మంచూరియా తిన్నాడు. అదంతా అతని స్నేహితులు వీడియో తీశారు. ఆ వీడియోలో అతనికి స్నేహితులు హెచ్చరించారు. ”అన్ ఎడ్యూకేటడ్ ఫెలో.. మెట్రోలో జర్నీ చేస్తూ తింటున్నాడు’ అంటూ వ్యాఖ్యానించటం స్పష్టంగా వినిపించింది.. అదే అతనికి ఫైన్ పడేలా చేసింది.. మొత్తానికి ఈ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.
తాజావార్తలు
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత… తెలుగు రాష్ట్రాల్లో బారీగా..! కారణమేంటి?
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!