Eating Banana: షాకింగ్ న్యూస్.. ఈ అరటిపండ్లు తింటే మనుషులు చనిపోతారా?
Eating Banana: పండ్లలో అరటిపండు ఎంతో చౌకగా లభిస్తుంది. అరటిపండు జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. కానీ ప్రస్తుతం అరటిపండ్ల గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అరటిపండ్లు తింటే చనిపోతారనే న్యూస్ తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. సోమాలియా నుంచి ఇటీవల భారత్కు పెద్ద ఎత్తున అరటిపండ్లు దిగుమతి అయ్యాయని.. వీటిని తింటే 12 గంటల్లో చనిపోతారని ప్రచారం జరగుతుండటం పలువురిని షాక్కు గురిచేస్తోంది. సోమాలియా నుంచి దిగుమతి అయిన అరటి పండ్లలో భయంకరమైన హెలికోబ్యాక్టర్ అనే బ్యాక్టీరియా ఉందని.. అది చూడటానికి వానపాములా ఉంటుందని.. ఈ బ్యాక్టీరియా ఉన్న అరటి పండ్లను తిన్న వెంటనే వాంతులు, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతూ తిన్న 12 గంటల్లోపు బ్రెయిన్ డెడ్ అయి మనిషి చనిపోతాడంటూ వదంతులు చెలరేగాయి.
Read Also:Self-Employment: సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసే మ్యాజిక్కే ‘డిజిటల్ మార్కెటింగ్’.
Also Read
- Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
- Funeral Dance: అంత్యక్రియల్లో అశ్లీల డ్యాన్స్లు.. అవాక్కైన నెటిజన్లు
- Shloka Mehta: ఇంటర్నెట్ను ఆకట్టుకున్న ముఖేష్ అంబానీ పెద్ద కోడలు సింప్ల్సిటీ.. వీడియో వైరల్
- Video Viral: అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితి.. వినూత్నంగా స్పందించిన యంగ్ బిజినెస్ మ్యాన్.!
అయితే ఈ వార్త గురించి తమిళనాడులోని నేషనల్ బనానా రీసెర్చ్ సెంటర్ కీలక వ్యాఖ్యలు చేసింది. పాడైన అరటి పండ్లలో హెలికోబ్యాక్టర్కు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదని తెలిపింది. అలాగే వీడియోలో చూపినట్టుగా బ్యాక్టీరియా పరిమాణం వానపాములా అంత పెద్దగా ఉండదని వెల్లడించింది. బ్యాక్టీరియాలను కేవలం మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలమని స్పష్టం చేసింది. మరో ముఖ్య విషయం ఏంటంటే.. సోమాలియా నుంచి భారత్ అరటి పండ్లను దిగుమతి చేసుకుంటున్నట్లు ఎటువంటి సమాచారం లేదని స్పష్టం చేసింది. ఇదంతా అసత్య ప్రచారం అని.. ఇలాంటి వాటిని నమ్మవద్దని షనల్ బనానా రీసెర్చ్ సెంటర్ సైంటిస్టులు సూచించారు. హెలికోబ్యాక్టర్ అనే బ్యాక్టీరియా స్టమక్ (పొట్ట) క్యాన్సర్కు కారణం అవుతుందని.. గంటల్లో ఆ బ్యాక్టీరియా మనిషిని చంపలేదని తెలిపారు.

తాజావార్తలు
-
Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!
-
Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
-
Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
-
Icon Star : ఐకాన్ స్టార్ కొత్త రూల్.. ఫ్యాన్స్కు పండగే!
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!