ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొస్తూనే వుంటుంది. ఇప్పటి వరకూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికల్లో షేరింగ్ ఆప్షన్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఫీచర్ ట్విట్టర్లో లేదు. ఇప్పుడు దీన్నే తీసుకొచ్చేందుకు కంపెనీ ఆలోచిస్తోందని తెలుస్తోంది. ఇలాంటి ఆప్షన్ కావాలని ఎప్పటినుంచో అడుగుతున్నారు. కానీ ఈ విషయం గురించి కంపెనీ ఇప్పుడే ఆలోచించింది.
Read Also సామాన్యుడితో ఆనంద్ మహీంద్రా డీల్… ఎట్టకేలుకు మహీంద్రా రీసెర్చ్ వ్యాలీకి ఆ కారు…
మిగిలిన సోషల్ మీడియా సంస్థల కంటే భిన్నంగా తమకు నచ్చిన ట్వీట్లను షేర్ చేసుకునేలా ఈ ఫీచర్ డెవలప్ చేస్తోంది.ట్విట్టర్ యూజర్లు తమ స్నేహితుల్లో 150 మందిని ఒక గ్రూప్గా చేసుకోవచ్చు. దీన్ని ‘ట్విట్టర్ ఫ్లాక్’ అంటున్నారు. ఈ గ్రూప్తో మాత్రమే ట్వీట్లను షేర్ చేసుకునే వీలుంటుంది. ఈ గ్రూప్లో షేర్ చేసిన ట్వీట్లు ఈ గ్రూప్లోని సభ్యులు మాత్రమే చూసే అవకాశం వుంటుంది. అలాగే వారిలో వారు రిప్లై ఇవ్వగలుగుతారట. ఈ ఫ్లాక్ నుంచి ఎవరినైనా తొలగించినా సదరు సభ్యుడికి ఎటువంటి నోటిఫికేషన్ లభించదు. త్వరలోనే ఈ ఫీచర్ను ట్విట్టర్ అందుబాటులోకి తీసుకు రానుంది. దీనివల్ల ట్విట్టర్ మరింత అందుబాటులోకి వస్తుంది.