Class 4 Question Issue: చిన్న ప్రశ్న.. పెద్ద దుమారం.. ఛత్తీస్గఢ్లో కుక్క పేర్ల అప్షన్లపై వివాదం
- ఛత్తీస్గఢ్లో నాలుగో తరగతి ప్రశ్నతో రగడ..
- ఛత్తీస్గఢ్లో కుక్కకు ఉన్న పేర్ల అప్షన్లపై వివాదం..
- పరీక్షా పత్రంలో మోనా కుక్క పేరు ఏమిటీ అనే అప్షన్లలో 'రామ్'..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Class 4 Question Issue: ఛత్తీస్గఢ్లో నాలుగో తరగతి మధ్యంతర ఇంగ్లిష్ పరీక్షలో వచ్చిన ఓ ప్రశ్న రాష్ట్రవ్యాప్తంగా వివాదంగా మారింది. వ్యాకరణం లేదా పాఠ్యాంశాలపై కాకుండా, ఒకే ఒక్క మల్టిపుల్ చాయిస్ ఆప్షన్ కారణంగా ఈ వివాదం చెలరేగింది. అయితే, రాయ్పూర్ డివిజన్కు చెందిన పలు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో జనవరి 6వ తేదీన నిర్వహించిన పరీక్షలో, “మోనా కుక్క పేరు ఏమిటి?” అనే ప్రశ్నను అడిగారు. దీనికి బల, షేరు, రామ్, పైవాటిలో ఏదీ కాదు అనే నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. అయితే, పరీక్ష అనంతరం ప్రశ్నాపత్రం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కుక్క పేరుకు ‘రామ్’ అనే ఆప్షన్ ఇవ్వడంపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇది మతపరమైన భావాలను దెబ్బతీసిందని ఆరోపించారు.
Also Read
- Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
- Viral Video: అమ్మ పెళ్లి చేస్తోందని గుండు చేయించుకున్న అమ్మాయి? వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదేనట!
- Animal Facts: ఒంటెలకు బతికున్న పాములను ఎందుకు తినిపిస్తారు? ఈ ఆచారం వెనుక అసలు నిజమేంటి?
- Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
ఇక, ఈ ప్రశ్నాపత్రం బలోదాబజార్, భాటాపారా, మహాసముంద్, ధమ్తరి, గరియాబంద్ జిల్లాల్లో పంపిణీ అయింది. వివాదం చెలరేగిన తర్వాత విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. సమగ్ర శిక్షా అభియాన్ పరిధిలో ప్రశ్నాపత్రం తయారీపై ఆరా తీస్తున్నారు. క్వశ్చన్ పేపర్ తయారీలో పాల్గొన్న ఉపాధ్యాయులు, మోడరేషన్ చేసిన సిబ్బంది నుంచి వివరణలు తీసుకుంటున్నారు. కాగా, విచారణలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెడ్ టీచర్ శిఖా సోని ప్రశ్నాపత్రం రూపొందించినట్టు తేలింది. ఆమె ‘రాము’ అని టైప్ చేయాలనుకున్నప్పటికీ, టైపింగ్లో ‘యు’ అక్షరం పడకపోవడంతో ‘రామ్’గా ముద్రించడమైందని వివరణ ఇచ్చారు.
Read Also: CM Chandrababu: తెలంగాణ వదిలిన నీటిని వాడుకుంటే తప్పేంటి..?
అయితే, ఇది అనుకోకుండా జరిగిన పొరపాటేనని సదరు టీచర్ శిఖా సోని క్షమాపణ చెప్పారు. ప్రశ్నాపత్రం మోడరేషన్ చేసిన కాంట్రాక్ట్ ఉపాధ్యాయురాలు నమ్రత వర్మ కూడా పొరపాటును గమనించలేకపోయానని తెలిపారు. కాగా, ప్రాథమిక విచారణ తర్వాత ప్రశ్నాపత్రం రూపొందించిన హెడ్మిస్ట్రెస్ను విద్యాశాఖ సస్పెండ్ చేసింది. మోడరేషన్ చేసిన ఉపాధ్యాయురాలిపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. మరోవైపు, మహాసముంద్ జిల్లా విద్యాధికారి ప్రింటింగ్ లోపం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు.
తాజావార్తలు
-
China: కొత్త గేమ్కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
-
Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
-
Cristiano Ronaldo: అర్జెంటీనాపై వివాదాస్పద పోస్ట్ను రొనాల్డో లైక్ చేశారా? సోషల్ మీడియాలో నెటిజన్ల రచ్చ..
-
Adluri Laxman : అధికారంలో ఉన్నప్పుడు రైతులు కనిపించలేదా..!
-
Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!