Fake IPS: రూ. రెండు లక్షలకు ఐపీఎస్ ఉద్యోగాన్ని కొనుగోలు చేసిన యువకుడు.. డ్యూటీ చేస్తుండగా..
- ఉద్యోగం పేరుతో మోసం
- బీహార్లోని జాముయ్లో ఉదంతం
- రూ. రెండు లక్షలు తీసుకుని యువకుడిని మోసం చేసిన వైనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగం పేరుతో మోసం చేసిన పెద్ద ఉదంతం బీహార్లోని జాముయ్లో వెలుగు చూసింది. ఇక్కడ మోసగాళ్ళు రూ. రెండు లక్షలు తీసుకొని ఓ యువకుడిని బురిడీ కొట్టించారు. నకిలీ ట్రైనీ ఐపీఎస్ని జాముయి సబ్ ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయడంతో అసలు విషయం బట్టబయలైంది. ఇప్పుడు ఇంత పెద్ద మోసం వెనుక ఏ ముఠా ఉందో తెలుసుకోవడానికి పోలీసులు ఈ మొత్తం కేసును దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల నుంచి పోలీసులు రాసి ఉన్న పల్సర్ బైక్ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
READ MORE:PM Modi US Visit : యూఎస్లో ప్రధానికి ఘన స్వాగతం.. కాసేపట్లో ‘మోడీ అండ్ అమెరికా’
Also Read
రెండు లక్షలకు పోలీసు ఉద్యోగం..
అరెస్టయిన నకిలీ ఐపీఎస్ని విచారించగా.. రెండు లక్షలు ఈ జాబ్ ఇచ్చారని.. యూనిఫారంతో పాటు పిస్టల్ కూడా వచ్చిందని పోలీసులకు తెలిపాడు. ఇప్పుడు తాను ఐపీఎస్ అయ్యానని చెప్పాడు. వాస్తవానికి, జముయి జిల్లా సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలో యూనిఫాంలో బైక్ పై తిరిగేస్తున్న మిథిలేష్ మాంఝీ యువకుడ్ని బీహార్ లోని జాముయ్ పోలీసులు పట్టుకున్నారు. చిన్న పిల్లలప్పుడు పోలీస్ యూనిఫాం కొనుక్కుంటే సరదాగా ఉంటుంది కానీ.. ఈ వయసులో పోలీస్ డ్రెస్ కొనుక్కుని వేసుకుంటే మోసం కిందకేసు పెడతారని సున్నితంగా హెచ్చరించారు. అత్యంత అమాయకంగా కనిపిస్తున్న ఆ యువకుడు తానే ఐపీఎస్ ఆఫీసర్నని ఎదురుదాడికి దిగాడు.
READ MORE: Devara Pre Release Event Cancelled: షాకింగ్ : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు
కేసేనని ఠాణాకు తీసుకెళ్లిన పోలీసులు యువకుడ్ని విచారించడం మొదలు పెట్టారు. యువకుడి కథనం ప్రకారం.. ఐపీఎస్ ఆఫీసర్ పోస్టును రూ. రెండు లక్షలకు కొనుక్కున్ననని చెప్పాడు. ఇటీవల ఓ జలపాతం వద్దకు టూర్ కు వెళ్లినప్పుడు అక్కడ ఓ యువకుడు పరిచయం అయ్యాడు. మాయ మాటలు చెప్పి బురిడీ కొట్టించాడు. తక్కువ ధరకే ఐఏఎస్ ని చేస్తానని చెప్పాగానే యువకుడు ఎగిరి గంతేశాడు. తనకు అందరూ తెలుసని .. ఇట్టే ఉద్యోగం ఇప్పిస్తానని మోసగాడు యువకుడిని నమ్మబలికాడు. ఫోన్లు మాట్లాడినట్లుగా నటించిన మోసగాడు.. రెండు లక్షలకు ఐపీఎస్ ఉద్యోగం వస్తుందని.. రెండున్నర రోజుల్లోనే తెచ్చివ్వాలన్నాడు. ఆ యువకుడు బంధువుల్ని వేధించి .. రెండు లక్షలు అప్పు తీసుకొచ్చి మోసగాడికి ఇచ్చాడు. అనంతరం మోసగాడు.. యూనిఫాంతోపాటు నకిలీ పిస్టల్ కూడా ఇచ్చినట్లు తెలిపారు. యువకుడు ఖైరా పోలీస్ స్టేషన్ ప్రాంతం నుంచి హల్సీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తన ఇంటికి వెళ్తున్నట్లు సమీప గ్రామస్థులు, ప్రత్యక్ష సభ్యుల నుంచి సమాచారం అందిందని సికంద్రా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు.
తాజావార్తలు
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?