India Growth: ఇండియా వృద్ధిపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్రాజన్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Growth: మన దేశం వచ్చే ఏడాది 5 శాతం గ్రోత్ సాధించినా గొప్ప విషయమేనని, అదే జరిగితే మనం అదృష్టవంతులమేనని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్రాజన్ అన్నారు. ఈ ఏడాదితో పోల్చితే వచ్చే సంవత్సరం మరింత కష్టంగా గడవనుందని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి వేగం మందగించబోతోందని అంచనా వేశారు. కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుకుంటూపోతున్నాయని, అందుకే గ్రోత్ పడిపోనుందని అభిప్రాయపడ్డారు.
ఇండియా కూడా దీనికి మినహాయింపు కాదని కుండబద్ధలు కొట్టారు. మన దేశంలో ఒక వైపు వడ్డీ రేట్లు పెరుగుతుంటే మరో వైపు ఎగుమతులు తగ్గుముఖం పడుతున్నాయని పేర్కొన్నారు. నింగినంటుతున్న నిత్యవసర సరుకుల ధరలు, కూరగాయల రేట్లతో పోల్చితే దేశ ద్రవ్యోల్బణం పెద్ద సమస్యే కాదని అన్నారు. అభివృద్ధి కుంటుపడటానికి ఇది కూడా కారణం కాబోతోందని రఘురామ్ రాజన్ వివరించారు.
Also Read
- Upendra Dwivedi: పాక్కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
- YS Jagan: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ దొంగ పనులు.!
read also: Today(21-12-22) Business Headlines: కేటీఆర్ దావోస్ పర్యటనతోపాటు మరిన్ని బిజినెస్ ముఖ్యాంశాలు
ఇండియా ఎకనమిక్ గ్రోత్ కొవిడ్ ముందు నాటి పరిస్థితుల కన్నా ఘోరంగా పతనమవుతోందని, ఇప్పటికే 9 నుంచి 5కి పడిపోయిందని తెలిపారు. కరోనా టైంలో ఎగువ మధ్యతరగతివాళ్లు ఇబ్బందిపడలేదని, వాళ్లు తమ పని తాము చేసుకున్నారని వెల్లడించారు. మహమ్మారి వల్ల ఎటొచ్చీ పేదలే తీవ్ర కష్టాల పాలయ్యారని, పరిశ్రమలు మూతపడటం వల్ల వాళ్ల ఉద్యోగాలు ఊడాయని, దీంతో పూట గడవని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదాయం లేకపోవటంతోపాటు అప్పులు పెరిగిపోయి దిగువ మధ్యతరగతి జనాల బాధలు వర్ణనాతీతంగా మారాయని గుర్తుచేశారు. పెట్టుబడిదారీ వ్యవస్థను వ్యతిరేకించకూడదని, గుత్తాధిపత్యమే దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని హితవు పలికారు. చిన్న కంపెనీలు పెద్ద కంపెనీలుగా ఎదగాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకంగా వ్యవహరించాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్రాజన్ సూచించారు.
తాజావార్తలు
-
TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
-
Sunil Narang: ‘ఏకాభిప్రాయం లేదు.. ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి’ ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ గుడ్ బై!
-
Likhitha Reddy: ప్రశాంత్ నీల్ భార్య కూడా ఎన్టీఆర్ ఫ్యానేనా? థియేటర్ లో ఆ రచ్చ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!