రేపు నాగార్జున సాగర్ ఉపఎన్నిక కౌంటింగ్ జరగనుంది. నల్గొండ పట్టణంలో ని అర్జాలబావి సమీపంలో ని (రాష్ట్ర గిడ్డంగుల సంస్థ )ఎఫ్.సి.ఐ గోదాముల్లో కోవిడ్ నిబంధలకు అనుగుణంగా కౌంటింగ్ కి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాగార్జున సాగర్ నియోజక మొత్తం ఓటర్లు 2,20,206 మొత్తం పాలైన ఓట్లు 1,89,782. సాగర్ ఉపఎన్నికలో మొత్తం 86.18 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికలో 1400 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. సాగర్ ఉపఎన్నికలో 41 మంది అబ్యర్థులు పోటీలో ఉన్నారు. కౌంటింగ్ సిబ్బంది కి ఇప్పటికే రెండు విడతలుగా శిక్షణ పూర్తి చేసారు. నేడు మాక్ కౌంటింగ్ నిర్వహించారు అధికారులు. కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే కౌంటింగ్ హల్ లో కి అనుమతి ఉంటుంది. ఎన్నికల నిబంధల ప్రకారం అబ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ లు, సిబ్బంది, అధికారులకు,పోలీసులకు మీడియా సిబ్బందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. రెండు హల్స్ లో హల్ కు 7 టేబుల్స్ చొప్పున మొత్తం 14 టేబుల్స్ లో 25 రౌండ్లల్లో లెక్కింపు జరగనుంది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది.సాయంత్రం 7 గంటల వరకు పూర్తి అయ్యే అవకాశం ఉంది. రేపు కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉండగా కోవిడ్ కేసుల దృష్ట్యా ఎవరు కౌంటింగ్ కేంద్రం వద్దకు రావద్దని సూచించారు.