మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. నాగార్జున సాగర్ లో రఘునందన్ రావుపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2021లో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మోడల్ కోడ్ అమల్లో ఉండగా అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారని ఫిర్యాదు చేశారు. ఉట్లపల్లి, పులిచెర్ల గ్రామాల్లో ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. ఎంపీడీవో దుబ్బ సత్యం ఫిర్యాదు మేరకు రఘునందన్ పై కేసు నమోదైంది. ఈ కేసును తాజాగా…
రేపు నాగార్జున సాగర్ ఉపఎన్నిక కౌంటింగ్ జరగనుంది. నల్గొండ పట్టణంలో ని అర్జాలబావి సమీపంలో ని (రాష్ట్ర గిడ్డంగుల సంస్థ )ఎఫ్.సి.ఐ గోదాముల్లో కోవిడ్ నిబంధలకు అనుగుణంగా కౌంటింగ్ కి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాగార్జున సాగర్ నియోజక మొత్తం ఓటర్లు 2,20,206 మొత్తం పాలైన ఓట్లు 1,89,782. సాగర్ ఉపఎన్నికలో మొత్తం 86.18 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికలో 1400 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. సాగర్ ఉపఎన్నికలో 41 మంది అబ్యర్థులు పోటీలో ఉన్నారు.…