Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Uncategorized Mp Komatireddy Venkat Reddy Writes Open Letter To Cm Kcr

సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమ‌టిరెడ్డి బ‌హిరంగ లేఖ‌…

NTV Telugu Twitter
Published Date :April 20, 2021 , 6:41 pm
By Manohar
సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమ‌టిరెడ్డి బ‌హిరంగ లేఖ‌…
  • Follow Us :
  • google news
  • dailyhunt

రైత‌న్న‌లారా ధాన్యం కొనుగోలుకు స‌ర్కార్‌పై యుద్దానికి సిద్ధం కావాల‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి పిలుపునిచ్చారు. పోరాటం చేస్తే త‌ప్ప స‌ర్కార్ ఐకేపీ సెంట‌ర్లు ప్రారంభించేలా లేద‌ని స్ప‌ష్టంచేశారు. అలాగే వెంట‌నే ఐకేపీ సెంట‌ర్లు ప్రారంభించాల‌ని సీఎం కేసీఆర్‌కు బ‌హిరంగ లేఖ‌ రాశారు. 

ఈ సంద‌ర్భంగా కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మాట్లాడుతూ… రైత‌న్న‌లు ఏకం కావాలని కోరారు. నాగార్జున సాగ‌ర్ ఎన్నిక‌లు ఉండ‌డంతో ఓట్ల కోసం అసెంబ్లీలో ఐకేసీ సెంట‌ర్లు ప్రారంభిస్తామ‌ని చెప్పిన సర్కార్ ఇప్పుడు ఆ ఊసే ఎత్త‌డం లేద‌ని మండిప‌డ్డారు. రైత‌న్న‌లు త్వ‌ర‌గా మేలుకోని.. సర్కార్‌పై యుద్దం ప్ర‌క‌టించాలని కోరారు.  పంట‌లు కోసి నెల రోజులు గ‌డుస్తున్న ఇప్ప‌టికీ ఒక్క ఐకేపీ సెంట‌ర్ ఎందుకు ప్రారంభించ‌లేదని స‌ర్కార్‌ను ప్ర‌శ్నించారు. ఆరు నెల‌లుగా క‌ష్ట‌ప‌డ్డ రైత‌న్న.. పంట‌ను అమ్ముకోవ‌డానికి ఐకేపీ కేంద్రాల వ‌ద్దకు తెచ్చి నెల‌రోజులుగా న‌ర‌క‌యాత‌న ప‌డుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కొద్ది రోజుల క్రితం ప‌డిన అకాల వ‌ర్షానికి చాలా ధాన్యం త‌డిసిపోవ‌డం… నీటిలో కొట్టుకుపోవడం జ‌రిగిందని తెలిపారు. మ‌ళ్లీ ఒక అకాల వ‌ర్షం ప‌డితే ఆ ధాన్యం పాడ‌వుతుంది కాబ‌ట్టి మీరు వెంట‌నే చీఫ్ సెక్రెట‌రీ, సంబంధిత మంత్రికి చెప్పి ఐకేపీ సెంట‌ర్ల ప్రారంభం చేప‌ట్టాలని డిమాండ్ చేశారు.

ఆరుకాలం క‌ష్టించి రైత‌న్న పండించిన పంట‌ను స‌ర్కార్ ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుక కొనుగోలు చేయాలో తెలంగాణ రైత‌న్న‌కు మీరు స‌మాధానం చెప్పాలన్నారు. ఎండ‌న‌క‌, వానన‌క రైత‌న్న‌లు పండించిన పంట‌లు కోసి నెల రోజులు కావాస్తున్న ఇప్ప‌టీ వ‌ర‌కు ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంట‌ర్లు ప్రారంభించి..ఒక్క గింజ కూడా కొనుగోలు చేయ‌లేదని వెల్ల‌డించారు. అస‌లు రైత‌న్న స‌మ‌స్య‌ల ప‌ట్ల మీ స‌ర్కార్ ఎందుకు మీన‌మేషాలు లెక్కిస్తుంది. ఎందుకు ఇంత చిన్న‌చూపు చూస్తుంది. త‌న ఒక్కో చెమ‌ట చుక్క‌ను ఒక్కో గింజ‌ను పండించిన రైత‌న్న చేత మీ టీఆర్ఎస్ స‌ర్కార్ క‌న్నీరు పెట్టిస్తుందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా 6వేల ఐకేపీ సెంట‌ర్ల ద్వారా ప్ర‌తి ఒక్క రైతు నుంచి చివ‌రి గింజ వ‌ర‌కు కొంటామ‌ని ప్ర‌గాల్భాలు ప‌లికిన కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు నిమ్మ‌కు నీరెత్తి వ్య‌వ‌హ‌రిస్తున్నారని ప్ర‌శ్నించారు. నాగార్జున సాగ‌ర్ నోటిఫికేష‌న్‌కు ముందు రైత‌న్న గురించి పంట కొనుగోలు గురించి మాట్లాడిన మీరు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు. అంటే ఎన్నిక‌ల్లో ల‌బ్ధి కోస‌మే మీరు ఐకేపీ సెంట‌ర్ల గురించి ప్ర‌క‌ట‌న చేశారా.. అని ప్ర‌శ్నించారు. మీకు రైతులంటే కేవ‌లం ఓట్లు వేసే యంత్రాలుగానే క‌నిపిస్తున్నారా… సాగ‌ర్ ఉప ఎన్నిక‌లు అయిపోవ‌డంతోనే రైతుల‌ను ప‌ట్టించుకోవ‌డం మానేశారని దుయ్య‌బ‌ట్టారు. ఇప్ప‌టీకే పూట్టేడు క‌ష్టాల్లో, అప్పుల్లో ఉన్న రైత‌న్న‌ పండించిన పంట‌ను మ‌ద్ద‌తు ధ‌ర‌కు సర్కార్ కొన‌క‌పోతే ఎంతో  ద‌ళారుల చేతిలో రైత‌న్న‌లు మోసపోవ‌డం జ‌రుగుతుందన్నారు.

ఢిల్లీ త‌ర‌హా రైతాంగ యుద్దం మ‌న రాష్ట్రంలో మొద‌ల‌వుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ గ‌డ్డ మీద పుట్టిన వ్య‌క్తికి ఉద్య‌మాలు చేయ‌డం కొత్త కాదు కాబ‌ట్టి ప్ర‌భుత్వం వెంట‌నే ఐకేపీ సెంట‌ర్లు ప్రారంభించి ధాన్యంను మ‌ద్ద‌తు ధ‌ర‌కు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైత‌న్న‌లు అంద‌రు ఏక‌మై స‌ర్కార్ పై పోరాటం చేస్తార‌ని తెలిపారు. రైత‌న్న‌లు చేసే ప్రతి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ, త‌ను అండ‌గా ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • mp komatireddy venkat reddy
  • writes open letter

తాజావార్తలు

  • Train Tickets Hike: ప్రధాని మోడీకి సీఎం స్టాలిన్ లేఖ.. రైలు టిక్కెట్‌ ధరలు పెంచొద్దని వినతి!

  • Suryakumar Yadav: సర్జరీ సక్సెస్.. కోలుకుంటున్న టీమిండియా కెప్టెన్.. ఫొటోస్ వైరల్

  • Pawan Kalyan: ఎమ్మెల్యే గోరంట్లపై పవన్‌ కల్యాణ్‌ ఛలోక్తులు!

  • WAR 2: 50 డేస్ కౌంట్‌డౌన్‌ పోస్టర్స్ షేర్ చేసిన యంగ్ టైగర్

  • Telangana : ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట.. రూ.180 కోట్లు మెడికల్ బిల్లులు విడుదల

ట్రెండింగ్‌

  • Fairphone Gen 6: 5 ఏళ్ల వారంటీ, మరమ్మతులకు అనుకూలంగా ఉండేలా మొబైల్ లాంచ్..!

  • HONOR X9C 5G: డిజైన్‌లో క్లాస్, పెర్ఫార్మెన్స్‌లో దమ్మున్న ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైన హానర్..!

  • TECNO Spark Go 2: మొబైల్‌లో సిగ్నల్ లేకున్నా పనిచేసే ఫీచర్‌.. కేవలం రూ. 6,999కే వచ్చేసిన ‘స్పార్క్ గో 2’ మొబైల్..!

  • Girl Friend Scam: ఇదేందయ్యా ఇది.. ఇంటి కోసం ఏకంగా 20 మంది అబ్బాలను ముగ్గులోకి దింపేసిందిగా..!

  • Vitamin D Foods: మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో విటమిన్ D ఎలా తోడ్పడుతుందంటే..?

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions