ధూళిపాళ్లని ఏసీబీ కస్టడీకి ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల క్రితం 5 రోజుల కస్టడీ పిటిషన్ సవాలు చేస్తూ ధూళిపాళ్ల వేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై స్టే ఇచ్చింది కోర్టు. అయితే నేడు పూర్తి స్థాయి విచారణ జరిపిన న్యాయస్థానం ధూళిపాళ్లను మూడు రోజులు , ఎండీ గోపాల కృష్ణ, సహకార శాఖ అధికారి గుర్నాధం ను రెండు రోజులు విచారించాలని ఆదేశాలు జారీ చేసింది. రాజమండ్రి జైలులోనే ఏసీబీ విచారించాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే విచారణ సమయంలో కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని ఏసీబీకి తెలిపింది కోర్టు.