ఏపీలో ఈరోజు 6 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. అయితే వాటిని జిల్లాలకు పంపిణీ చేసింది వైద్యారోగ్య శాఖ. ఇక ప్రాధాన్యతల వారీగా కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ సిబ్బందికి కరోనా వాక్సినేషనులో హై ప్రయార్టీ ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. సీఎం ఆదేశాల మేరకు ఫ్రంట్ లైన్ వర్కర్లకు.. హెల్త్ కేర్ వర్కర్లకు వచ్చే 72 గంటల్లో వంద శాతం మేర వ్యాక్సినేషన్ చేయాలని కలెక్టర్లకు సూచించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో ఫ్రంట్ లైన్ వర్కర్లు.. హెల్త్ కేర్ సిబ్బంది కీలకం కావడంతో టీకాలు వేయాలని సీఎం జగన్ తెలిపారు. అయితే ఇంకా కరోనా టీకాలు వేసుకోని వారు 1.80 లక్షల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ సిబ్బంది ఉన్నారు. కరోనా టీకాలు వేయించుకోని ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ సిబ్బందిలో కృష్ణా, విజయనగరం జిల్లాల వారే అధికంగా ఉన్నారు. సెకండ్ ప్రయార్టీగా రెండో డోస్ వేయించుకోవాల్సిన వారిని కూడా పరిగణనలోకి తీసుకోవాలనన్నారు అధికారులు. అయితే రాష్ట్రానికి మరిన్ని డోసులు కావాలంటూ కేంద్రాన్ని కోరిన వైద్యారోగ్య శాఖ… వచ్చిన ఆరు లక్షల డోసులు ఒక్క రోజుకు కూడా చాలవని తెలిపింది.