ఈ కప్పు టీ రూ.15 లక్షలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి మూడోసారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నేతలు బీజేపీపైన, ప్రధాని మోడీపైన పలురకాల విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇక, టిఎంసీ పార్టీ ఎమ్మెల్యే మదన్ మిత్ర చాయ్వాలా అవతారం ఎత్తారు. ప్రజలకు ఆయన ఉచితంగా టీ తయారు చేసి అందించారు. టీ ధర రూ.15 లక్షలు అని ప్రజలు రూ.15 లక్షలు కట్టాలని, 2014 ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే దేశంలోని అందరి అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పారని వ్యంగ్యంగా విమర్శలు చేశారు. 2014 నుంచి మోడీ ఇచ్చిన హామీ ఎప్పుడు అమలౌతుందా అని ఎదురుచూస్తున్నామని అన్నారు.
Read: “ఎవరు మీలో కోటీశ్వరులు” గురించి ఈ విషయాలు తెలుసా?
Also Read
విపక్షాలు సైతం ఈ హామీ అమలు కోసం ఎదురు చూస్తున్నట్టు మదన్ మిత్రా పేర్కొన్నారు. ఆదివారం రోజున కోల్కతాలోని భవానీపూర్లో ప్రజలకు ఉచితంగా టీని అందించారు. ప్రధాని మోడీ తయారు చేసిన చాయ్కి దగ్గరగానే ఈ టీ ఉంటుందని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్లో మదన్ మిత్ర కీలక నేతగా ఉన్నారు. గతంలో ఆయన రవాణశాఖ మంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రి మమత బెనర్జీకి అత్యంత ఆప్తుల్లో ఆయన కూడా ఒకరు.
- Tags
- Chai
- kolkata
- Madan Mitra
- MLA
- Tea
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!