తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది.. ప్రతీరోజు లక్షకు పైగానే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నా.. పాజిటివ్ కేసులు మాత్రం రెండు వేల లోపే నమోదు అవుతున్నాయి.. తాజాగా ఆ కేసుల సంఖ్య 17 వందలకు చేరువైంది.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,20,525 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1771 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.. మరో 13 మంది కోవిడ్ బారినపడి మృతిచెందగా.. ఇదే సమయంలో 2384 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల 6,02,089 కి చేరింది.. రికవరీ కేసులు 5,76,487 కి పెరిగాయి.. ఇప్పటి వరకు రాష్ట్రంలో కోవిడ్ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 3,469 కు పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రంలో 22,133 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం.