రాజేంద్రనగర్ లో విద్యార్థినిపై అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళలు, యవతులు, విద్యార్ధినులు అనే తేడా లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. ముక్కుపచ్చలారని ఓ విద్యార్ధిపై అఘాయిత్యం చేశాడో ప్రబుద్ధుడు. రాజేంద్రనగర్ లో ఈ దారుణం జరిగింది. పదవ తరగతి విద్యార్ధినిపై అత్యాచారం చేశాడో యువకుడు. అమ్మాయికి మాయ మాటలు చెప్పి తన ఇంటి నుండి మోటర్ సైకిల్ పై హిమాయత్ సాగర్ తీసుకొని వెళ్ళాడా యువకుడు. చెట్ల పొదల్లోకి తీసుకొని వెళ్లి బలవంతంగా అత్యాచారానికి ఒడిగట్టాడు ఆ కామాంధుడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించాడు.
అత్యాచారం అనంతరం తిరిగి ఆ విద్యార్ధినిని ఇంటి వద్ద వదలి వెళ్లిపోయాడు నిందితుడు. తనకు జరిగిన అన్యాయాన్ని తల్లితో చెప్పుకుంది బాధితురాలు. దీంతో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది బాధితురాలి తల్లి. తల్లి ఫిర్యాదు మేరకు యువకుని పై రేప్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Also Read
- Ireland: ఐర్లాండ్లో అల్లర్లు.. తగలబడ్డ కార్లు, భవనాలు
- Pakistan: పీవోకేలో కూలిన పాక్ హెలికాప్టర్.. 21 మంది సైనికులు మృతి
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
నిందితుడి అరెస్ట్.. అతనూ మైనరే
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిని అరెస్ట్ చేశామని శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. రేప్ కు పాల్పడిన నిందితుడు కూడా మైనరే. నిందితుడు కర్ణాటక వాసి. బాధితురాలకి నిందితుడు ముందు నుంచే తెలుసు. అమ్మాయి పట్ల చాలా కాలం నుంచి అసభ్య ప్రవర్తన ఇబ్బంది పెట్టాడు. 28 వ తేదిన ఈ ఘటన జరిగింది.గుడికి వెళదాం అని చెప్పి.. కోత్వాల్ లో ఉన్న పొదలలో అత్యాచారం చేశాడు. పిల్లర్ నంబర్ 118 వద్ధ నిందితుడిని అరెస్ట్ చేసాం. నిందితుడిని ఈరోజు రిమాండ్ కి తరలిస్తామన్నారు శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్లో అల్లర్లు.. తగలబడ్డ కార్లు, భవనాలు
-
TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
-
Sai Pallavi: సాయి పల్లవికి ‘రామాయణ’ శాపంగా మారిందా?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్కు విలువైన పాఠం..!
-
Pakistan: పీవోకేలో కూలిన పాక్ హెలికాప్టర్.. 21 మంది సైనికులు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!