కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు భారత్ను టెన్షన్ పెడుతోంది.. దేశ రాజధాని ఢిల్లీ సహా.. మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు.. ఇలా పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి.. ఇక, ఢిల్లీలో ఒమిక్రాన్ విజృంభిస్తోంది.. దీంతో.. అప్రమత్తమైన ఆమ్ ఆద్మీ సర్కార్.. దేశ రాజధానిలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కోవిడ్ కేసుల తీవ్రత దృష్ట్యా ఆంక్షలు మరింత కఠినతరం చేస్తున్నట్టు ప్రకటించారు సీఎం అరవింద్ కేజ్రీవాల్..
అయితే, ఎలాంటి ఆంక్షలు ఉంటాయన్నదానిపై త్వరలోనే పూర్తిస్థాయి ఆదేశాలను జారీ చేయనున్నట్టు తెలిపారు. కాగా, దేశ రాజధానిలో గత 2 రోజులుగా పాజిటివిటీ రేటు 0.5 శాతంగా నమోదవుతోంది.. ఈ క్రమంలోనే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ లెవల్ 1 అంటే ఎల్లో అలర్ట్ అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చింది ఢిల్లీ సర్కార్. ఇప్పటికే ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండగా.. ఢిల్లీలో 50 శాతం ఆక్యుపెన్సీతో మెట్రో, బార్లు. ప్రార్థనా మందిరాల్లో భక్తులకు నో ఎంట్రీ.. సరి-బేసీ పద్ధతిలో మాల్స్కు అనుమతి ఉంటుంది.. మరోవైపు.. కొత్తగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా.. ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నా.. వ్యాధి తీవ్రత స్వల్పంగానే ఉందని చెప్పారు కేజ్రీవాల్. ఆక్సిజన్ వినియోగం, వెంటిలేటర్ల వాడకం పెరగలేదని దానికి ఉదాహరణగా చెప్పుకొచ్చారు కేజ్రీవాల్.